Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
- పాకిస్తాన్ కుట్ర బయటపడింది..
- వందలాది విమానాలు గాలిలో ఉండగానే డ్రోన్ దాడులు..
- పౌర విమానాలను రక్షణగా వాడుకుంటున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
అయితే, శుక్రవారం రాత్రి డ్రోన్ దాడి జరుగుతున్న సమయంలో ఐబీ, ఎల్ఓసీ సమీపంలో దాదాపుగా 100 కంటే ఎక్కువ పౌర విమానాలు ప్రయాణిస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ విమానాశ్రయాల్లో పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ , టేకాఫ్ అవుతున్నట్లు డేటా చూపించింది. దీనిని బట్టి చూస్తే వీటిని ఒక రక్షణగా ఉపయోగించుకుని పాక్ దాడికి తెగబడింది. ఒక వేళఈ దాడిన అడ్డుకునేందుకు భారత్ ఎయిర్పోర్టులపై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాని చూస్తోంది.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Pak drone attacks: 20కి పైగా నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు..
లాహోర్ విమానాశ్రయం అంతర్జాతీయ సరిహద్దు నుండి 17 కి.మీ దూరంలో ఉండగా, కరాచీ 173 కి.మీ దూరంలో ఉంది మరియు ఇస్లామాబాద్ విమానాశ్రయం నియంత్రణ రేఖ నుండి 133 కి.మీ దూరంలో ఉంది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లైనాస్, ఖతార్ ఎయిర్ వేస్, ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఎయిర్, జజీరా వంటి విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 39 విమానాలు పాక్ గగనతలంలో ఉన్నాయి. భారత్ దాడి చేయకుండా ఈ విమానాలను పాక్ ఒక కవచంలా వాడుకుంటోంది.
అంతకుముందు, శుక్రవారం జరిగిన భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. దాడులు చేసే సమయంలో కనీసం పాక్ తన గగనతలాన్ని మూసివేయడం లేదని, పౌర విమానాలను ఒక రక్షణగా వాడుకుంటోందని వారు ఆధారాలతో చెప్పారు. అయినా కూడా ఈ రోజు పాకిస్తాన్ మరోసారి ఇదే పనిచేసింది.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!