S Jaishankar: పాకిస్తాన్కు అర్థం చేసుకునే తెలివి లేదు.. అఖండ భారత్ చిత్రంపై జైశంకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) గురించి జైశంకర్ మాట్లాడుతూ..మేము మా వైఖరిపై స్పష్టంగా ఉన్నామని, ఇది ఒక్క బీజేపీ వైఖరే కాదని, దేశం, పార్లమెంట్ కూడా పీఓకే భారత్ లో అంతర్భాగం అని చెబుతున్నారని తెలిపారు. మే 28న ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో పురాతన భారతదేశ మ్యాప్ను చూపించే కుడ్యచిత్రం ఉంది. ఆనాటి కాలంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా విరాజిల్లిన తక్షశిల(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)ను కూడా అఖండ భారతంలోనే భాగంగా ఉండేది. అయితే పాకిస్తాన్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ కూడా ఈ చిత్ర పటంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Bihar: వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న బాలుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
ప్రధాని మోడీ, అధికార బీజేపీపై అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ మండిపడ్డారు. వాస్తవాలపై సరైన అవగాహన లేకుండా రాహుల్ గాంధీ ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీకి విదేశాల్లో భారతదేశాన్ని విమర్శించే అలవాటు ఉందని జైశంకర్ అన్నారు.
పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన అఖండ భారత చిత్రంపై పాకిస్తాన్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇటీవల భారత పర్యటకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ని ఈ సమస్యని భారత్ లో లేవనెత్తాలని పలువురు నేపాల్ నాయకులు కోరారు. నేపాల్ మాజీ ప్రధాని బాబూరా ఎం భట్టారాయ్ మాట్లాడుతూ, “కొత్త పార్లమెంటు భవనంలోని అఖండ భారత్ కుడ్యచిత్రం వివాదాస్పదమైనది, ఇది పొరుగు దేశాలతో దౌత్యవ్యూహాలకు హానికరం అని అన్నారు. గత వారం, పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతా జె. జెహ్రా బలోచ్ కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన గోడపై ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!