Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
- ప్రతిపక్షాల వైఫల్యం, హిందూ ఓట్ల ఏకీకరణే బీజేపీ గెలుపుకు కారణం..
- ఎంఐఎం బీ-టీమ్ విమర్శలపై అసదుద్దీన్ ఓవైసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం వల్లే బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వరసగా గెలుస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇందుకు ప్రతిపక్షాల వైఫల్యం కూడా కారణమవుతుందని చెప్పారు. బీజేపీకి ఎంఐఎం బీ-టీమ్ అవునా..? అని ప్రశ్నించిన సమయంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరుచుగా ప్రతిపక్షాలు ఎంఐఎంపై చేసే ఈ ఆరోపణలపై ఓవైసీ స్పందిస్తూ.. ఇది తనను నిందించడానికి, ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తన పార్టీ పట్ల ప్రతిపక్షాల ద్వేషం తప్ప మరొకటి కాదని అన్నారు.
Read Also: CM Revanth Reddy: అసలైన కారణాలు ఏంటి? అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశాలు..
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ప్రతిపక్ష వైఫల్యాల వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుందని, దాదాపుగా 50 శాతం హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పారు. ‘‘మీరు నాపై ఎలా నిందలు వేస్తారు..? 2024 లోక్సభ ఎన్నికల్లో నేను హైదరాబాద్, ఔరంగాబాద్, కిషన్ గంజ్, మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తే, బీజేపీ 240 సీట్లు గెలిస్తే, నేను బాధ్యత వహిస్తానా..?’’ అని ఆయన అడిగారు.
ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ఓట్లను తేలికగా తీసుకుంటున్నాయని మరియు వారి నిజమైన ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతీ వర్గానికి రాజకీయ నాయకత్వం కొరుకుంటున్న వారు, ముస్లింలకు మాత్రం ఉండకూడదని అనుకుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. ముస్లింలు దాదాపుగా 15 శాతం ఉంటే, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం 4 శాతం మాత్రమే అని చెప్పారు. ‘‘రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడటం మానేసి, వారికి విద్యను అందించడానికి, వారికి న్యాయంగా వ్యవహరించడానికి మరియు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేయాలి.’’ అని కోరారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!