Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pahalgam Terrorists Hiding In South Kashmir

Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!

Published Date :May 2, 2025 , 8:26 am
By Suresh Maddala
  • భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు!
  • ఎన్ఐఏ అంచనా ఇదే!
Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పహల్గామ్‌లో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్‌లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్థాన్‌కు వెళ్లలేదని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని.. స్థానికులు వారికి సపోర్ట్‌గా నిలిచినట్లుగా దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని మరోసారి హడలెత్తించిన భారీ వర్షం.. దుమ్ము తుఫాన్.. ఫ్లైట్స్‌కు అంతరాయం

Also Read

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
  • JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పట్టపగలు ఏకే 47 తుపాకులతో ముష్కరులు చెలరేగిపోయారు. హిందువులు టార్గెట్‌గా 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. పదులకొద్ది గాయపడ్డారు. అనంతరం ముష్కరులు దక్షిణ కాశ్మీర్‌లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ‘‘ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్’’ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: PM Modi Amravati Tour: ప్రధాని మోడీ అమరావతి పర్యటన.. వాహనదారులకు అలర్ట్..

ఇక పహల్గామ్ దాడికి ముందు బైసారన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే నలుగురు ఉగ్రవాదలు భారత్‌లో సేఫ్ జోన్‌లో ఉన్నట్లుగా గుర్తించారు.

యస్ మోర్..

ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉండడంతోనే తప్పించుకోగలుగుతున్నారని కాశ్మీర్‌లో పని చేసిన రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ యస్ మోర్ మీడియాకు తెలియజేశారు. ఆ పరికరాలకు సిమ్ కార్డులతో పని లేదన్నారు. ఉగ్రదాడి సమయంలో మూడు ఉపగ్రహ ఫోన్‌లు ఉపయోగించారని.. ఈ ఫోన్లు కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టలేకపోయాయని భావిస్తున్నారు. ముగ్గురు మాత్రమే దాడిలో పాల్గొన్నారని.. ఇంకొకడు వీరికి సహాయం చేయడానికి మరొక చోట దాగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్థానిక ఉగ్రవాదులు కూడా సమీపంలోనే నక్కి ఉండొచ్చని యస్ మోర్ అంచనా వేశారు.

ఎన్‌క్రిప్టెడ్ విశిష్టత ఇదే..
ప్రస్తుతం ఉగ్రవాదులు ఎన్‌క్రిప్టెడ్ అనే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కనిపెట్టింది. ఇదొక భద్రతకు సంబంధించిన పరికరం. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుంది. ఇతరుల నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lashkar taiba terrorists
  • NIA
  • Pahalgam terror attack
  • Pahalgam terrorists hiding
  • south kashmir

తాజావార్తలు

  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..

  • Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే

  • JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Raw Mango Chutney Recipe: సింపుల్‌గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions