Pahalgam Terror Attack: భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
- భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు!
- ఎన్ఐఏ అంచనా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో నరమేధం సృష్టించిన ముష్కరులు భారత్లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక అంచనాకు వచ్చింది. వారు పాకిస్థాన్కు వెళ్లలేదని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని ఒక దట్టమైన అడవిలో ఉన్నట్లుగా పేర్కొంది. ఒక పక్కా ప్రణాళికతో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారని తెలిపింది. ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం స్వయం సమృద్ధి కలిగి ఉన్నారని.. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కగా అందుతున్నాయని.. స్థానికులు వారికి సపోర్ట్గా నిలిచినట్లుగా దర్యాప్తు సంస్థ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని మరోసారి హడలెత్తించిన భారీ వర్షం.. దుమ్ము తుఫాన్.. ఫ్లైట్స్కు అంతరాయం
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఏప్రిల్ 22న పహల్గామ్లో పట్టపగలు ఏకే 47 తుపాకులతో ముష్కరులు చెలరేగిపోయారు. హిందువులు టార్గెట్గా 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. పదులకొద్ది గాయపడ్డారు. అనంతరం ముష్కరులు దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రస్తుతం వారు ‘‘ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్’’ పరికరాలు ఉపయోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది. దీంతో వారంతా సులువుగా తప్పించుకుంటున్నారని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi Amravati Tour: ప్రధాని మోడీ అమరావతి పర్యటన.. వాహనదారులకు అలర్ట్..
ఇక పహల్గామ్ దాడికి ముందు బైసారన్ లోయలో దాదాపు 48 గంటల ముందే ఉగ్రవాదులు ఉన్నట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించి.. భారీగా జనం వచ్చాక అదునుచూసి ఎటాక్ చేసినట్లుగా కనిపెట్టారు. నాలుగు ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించింది. ఉగ్రవాదులకు స్థానికుల సహకారం పూర్తిగా ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. దాడి సమయంలో కూడా వారంతా ఉన్నట్లుగా కూడా కనిపెట్టింది. ప్రస్తుతం ఆ స్థానికుల సహకారంతోనే నలుగురు ఉగ్రవాదలు భారత్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా గుర్తించారు.
యస్ మోర్..
ఉగ్రవాదుల దగ్గర అధునాతనమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉండడంతోనే తప్పించుకోగలుగుతున్నారని కాశ్మీర్లో పని చేసిన రిటైర్డ్ రక్షణ నిపుణుడు మేజర్ జనరల్ యస్ మోర్ మీడియాకు తెలియజేశారు. ఆ పరికరాలకు సిమ్ కార్డులతో పని లేదన్నారు. ఉగ్రదాడి సమయంలో మూడు ఉపగ్రహ ఫోన్లు ఉపయోగించారని.. ఈ ఫోన్లు కారణంగానే భద్రతా దళాలు వారి జాడ కనిపెట్టలేకపోయాయని భావిస్తున్నారు. ముగ్గురు మాత్రమే దాడిలో పాల్గొన్నారని.. ఇంకొకడు వీరికి సహాయం చేయడానికి మరొక చోట దాగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటు స్థానిక ఉగ్రవాదులు కూడా సమీపంలోనే నక్కి ఉండొచ్చని యస్ మోర్ అంచనా వేశారు.
ఎన్క్రిప్టెడ్ విశిష్టత ఇదే..
ప్రస్తుతం ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ అనే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థ కనిపెట్టింది. ఇదొక భద్రతకు సంబంధించిన పరికరం. సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుంది. ఇతరుల నుంచి రక్షణ కల్పిస్తుంటుంది. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!