Pahalgam Terror Attack: ఉగ్రవాదుల చేతిలో ‘ఎన్క్రిప్టెడ్’ పరికరాలు.. దీని ప్రత్యేకతలు ఇవే!
- ఉగ్రవాదుల చేతిలో ‘ఎన్క్రిప్టెడ్’ పరికరాలు
- ప్రస్తుతం భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు
- ఎన్ఐఏ అంచనా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా భావిస్తోంది. స్థానికుల సహకారంతో వీరంతా భద్రంగా ఉన్నట్లుగా అంచనా వేస్తోంది.
అయితే వీరి దగ్గర అత్యంత భద్రత కలిగిన ‘‘ఎన్క్రిప్టెడ్’’ (Encrypted) కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నట్లుగా భావిస్తోంది. ఇదొక సీక్రెట్ పరికరం. ఈ పరికరాలు సమాచారాన్ని అంత్యంత గోప్యంగా ఉంచుతాయి. సమాచారం గానీ.. డేటా గానీ రహస్య కోడ్గా మారిపోతుంది. ఇదొక గూఢ లిపి పరికరం. ఈ పరికరాలు ఉన్న వారికి మాత్రం కోడ్ భాష అర్థమవుతోంది. అంతేకాకుండా సమాచారం కూడా వారికి మాత్రమే అందుతుంది. ఇలాంటి అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం వల్ల ఉగ్రవాదుల జాడ తెలియడం లేదు. ఈ పరికరాలు అత్యంత భద్రతతో పాటు సమాచారం కూడా చాలా సురక్షితంగా ఉంచుతుంది.
Also Read
ఇది కూడా చదవండి: Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు
ఈ పరికరాలు సైనిక ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రహస్య సంభాషణను చేరవేయడానికి సైన్యాలు ఉపయోగించేవి. గ్రీస్, రోమ్ ఈ పరికరాలను విరివిగా ఉపయోగించింది. అత్యంత ప్రసిద్ధమైన పరికారాల్లో ఎన్క్రిప్టెడ్ ఒక పరికరం. 800 AD ప్రాంతంలో అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు అల్ కండి ఈ పరికరాన్ని రూపొందించాడు. ఈ పరికరం అత్యంత సేఫ్ జోన్ అస్త్రంగా చెబుతుంటారు. అందుకే ప్రస్తుతం ఈ పరికరాన్ని వాణిజ్యం, భద్రత, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బదిలీల కోసం ఉపయోగిస్తుంటారు. సైబర్ దాడులను నిరోధించడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపుగా ప్రపంచంలో 71 శాతం కంపెనీలన్నీ ఈ వ్యవస్థనే ఉపయోగిస్తుంటాయి. దీన్ని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు. చూడలేరు. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లైన జంటలు.. భర్తలను కోల్పోయారు. మతం పేరుతో ఈ దాడులు చేశారు. కేవలం హిందువులు టార్గెట్గా ముష్కరులు చెలరేగిపోయారు. ఇక ఈ దాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!