Pahalgam Terror Attack: ఉగ్రవాదుల చేతిలో ‘ఎన్క్రిప్టెడ్’ పరికరాలు.. దీని ప్రత్యేకతలు ఇవే!
- ఉగ్రవాదుల చేతిలో ‘ఎన్క్రిప్టెడ్’ పరికరాలు
- ప్రస్తుతం భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు
- ఎన్ఐఏ అంచనా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో నేరమేధం సృష్టించిన ఉగ్రవాదులు ప్రస్తుతం భారత్లోనే ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో సేఫ్ జోన్లో ఉన్నట్లుగా భావిస్తోంది. స్థానికుల సహకారంతో వీరంతా భద్రంగా ఉన్నట్లుగా అంచనా వేస్తోంది.
అయితే వీరి దగ్గర అత్యంత భద్రత కలిగిన ‘‘ఎన్క్రిప్టెడ్’’ (Encrypted) కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నట్లుగా భావిస్తోంది. ఇదొక సీక్రెట్ పరికరం. ఈ పరికరాలు సమాచారాన్ని అంత్యంత గోప్యంగా ఉంచుతాయి. సమాచారం గానీ.. డేటా గానీ రహస్య కోడ్గా మారిపోతుంది. ఇదొక గూఢ లిపి పరికరం. ఈ పరికరాలు ఉన్న వారికి మాత్రం కోడ్ భాష అర్థమవుతోంది. అంతేకాకుండా సమాచారం కూడా వారికి మాత్రమే అందుతుంది. ఇలాంటి అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం వల్ల ఉగ్రవాదుల జాడ తెలియడం లేదు. ఈ పరికరాలు అత్యంత భద్రతతో పాటు సమాచారం కూడా చాలా సురక్షితంగా ఉంచుతుంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇది కూడా చదవండి: Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు
ఈ పరికరాలు సైనిక ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రహస్య సంభాషణను చేరవేయడానికి సైన్యాలు ఉపయోగించేవి. గ్రీస్, రోమ్ ఈ పరికరాలను విరివిగా ఉపయోగించింది. అత్యంత ప్రసిద్ధమైన పరికారాల్లో ఎన్క్రిప్టెడ్ ఒక పరికరం. 800 AD ప్రాంతంలో అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు అల్ కండి ఈ పరికరాన్ని రూపొందించాడు. ఈ పరికరం అత్యంత సేఫ్ జోన్ అస్త్రంగా చెబుతుంటారు. అందుకే ప్రస్తుతం ఈ పరికరాన్ని వాణిజ్యం, భద్రత, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బదిలీల కోసం ఉపయోగిస్తుంటారు. సైబర్ దాడులను నిరోధించడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపుగా ప్రపంచంలో 71 శాతం కంపెనీలన్నీ ఈ వ్యవస్థనే ఉపయోగిస్తుంటాయి. దీన్ని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు. చూడలేరు. ఈ పరికరంతోనే ఉగ్రవాదులు సురక్షితంగా ఉన్నట్లుగా ఎన్ఐఏ కనిపెట్టింది.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పెళ్లైన జంటలు.. భర్తలను కోల్పోయారు. మతం పేరుతో ఈ దాడులు చేశారు. కేవలం హిందువులు టార్గెట్గా ముష్కరులు చెలరేగిపోయారు. ఇక ఈ దాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!