Vinay Narwal: ముస్లింలపై నేవీ ఆఫీసర్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు
- పహల్గామ్ ఉగ్ర దాడిలో భర్తను కోల్పోయిన హిమాన్షి
- రక్తదాన శిబిరంలో ముస్లింలపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి కీలక వ్యాఖ్యలు చేశారు. వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముస్లింల పట్ల ఎలాంటి ద్వేషం లేదని ఆమె పేర్కొన్నారు. తనకు కాశ్మీరీల పట్ల గానీ.. ముస్లింల పట్ల గానీ ఎలాంటి ద్వేషం లేదని.. తాము శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ.. న్యాయం కోసం గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారని.. అయినా కూడా కాశ్మీరీలకు.. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలు వెళ్లాలని తాను కోరుకోవడం లేదని.. కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే కోరుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
గురుగ్రామ్కు చెందిన హిమాన్షి పీహెచ్డీ స్కాలర్. ఏప్రిల్ 16న నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ను వివాహం చేసుకుంది. అనంతరం ఏప్రిల్ 19న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అటు తర్వాత హనీమూన్ కోసమని విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ప్లాన్ కుదరకపోవడంతో పహల్గామ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 22న భర్తతో కలిసి సరాదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారి ముష్కరులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అంతే ఒక్కసారిగా తూటాలకు వినయ్ నర్వాల్ నేలకొరిగారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం దగ్గరే హిమాన్షి కుప్పకూలిపోయింది. తీవ్రంగా కన్నీటి పర్యాంతం అయింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని మరోసారి హడలెత్తించిన భారీ వర్షం.. దుమ్ము తుఫాన్.. ఫ్లైట్స్కు అంతరాయం
ఇక వినయ్ నర్వాల్కు హర్యానాలో సైనిక లాంఛనలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి సైనీతో పాటు కేంద్రమంత్రి ఖట్టర్, పలువురు నేతలు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాళులర్పించారు. అనంతరం హిమాన్షిని ఓదార్చారు. ఇక భర్త శవపేటికను కౌగిలించుకుని హిమాన్షి సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Karnal | "…We don't want people going against Muslims or Kashmiris. We want peace and only peace. Of course, we want justice," says Himanshi, wife of Indian Navy Lieutenant Vinay Narwal, who was killed in the Pahalgam terror attack. pic.twitter.com/LaOpBVe7z2
— ANI (@ANI) May 1, 2025
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..