IT Raids: కాంగ్రెస్ ఎంపీపై ఐటీ దాడులు.. ఏకంగా రూ.100 కోట్ల నగదు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి.
ఐటీ శాఖ వర్గాల ప్రకారం.. ఒడిశాలోని బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన పలు ప్రదేశాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. సంబల్ పూర్, బోలంగీర్, తితిలాగఢ్, బౌధ్, సుందర్ఘర్, రూర్కెలా, భువనేశ్వర్లలో దాడులు జరుగుతున్నాయి. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ అధికారులు నగదు లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్స్, 30 మందికి పైగా అధికారులను వినియోగిస్తున్నారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
Read Also: Rajinikanth: వరదల్లో మునిగిన రజనీకాంత్ ఇల్లు.. వీడియో వైరల్
భువనేశ్వర్ లో జరుగుతున్న దాడులను ఐటీ డైరెక్టర్ సంజయ్ బహదూర్ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ కంపెనీలు నికర లాభాలను తక్కువగా చేపడంతో పాటు బ్యాలెన్స్ షీట్స్లో కొన్ని అనుమానపు లావాదేవీలు చేసినట్లు ఐటీ అధికారులు ధృవీకరించారు. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాష్ ఎక్స్ ద్వారా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో ఇతర కాంగ్రెస్ ఎంపీలకు తప్పకుండా ప్రమేయం ఉంటుందని ఆరోపించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!