Asaduddin Owaisi: గోసంరక్షకులకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది.. భివానీ హత్యలపై అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
ఈ హత్యల్లో మైనారిటీలపై హింస లక్ష్యంగా ఉందని అన్నారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వారే జునైద్, నాసిర్లను హత్యలు చేశారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థికృత ముస్లిం ద్వేషం ప్రబలుతోందని, నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా..? అని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గో రక్షకుల అనే వేషధారణలో ప్రజలను చంపి, దోపిడిలకు పాల్పడుతున్న ఇలాంటి రాడికల్ ఎలిమెంట్స్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని.. ఇలాంటి వారిని ప్రోత్సహించడం మానేయాలని ఓవైసీ అన్నారు.
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Read Also: Imran Khan: క్యాన్సర్ చికిత్సకు నొప్పి మాత్ర వాడతారా.? పాక్-ఐఎంఎఫ్ డీల్ పై విమర్శలు..
ఈ కేసులో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, పోలీసులు కుమ్మకయ్యరాని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించే వరకు జునైడ్, నసీర్లకు న్యాయం జరగదని అన్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని.. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగదని అన్నారు. మీరు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించవచ్చు. కానీ యూట్యూబ్ లో ఉంటున్న ఇటువంటి నేరాల హింసాత్మక వీడియోలను నిషేధించలేదని అన్నారు.
రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35) బుధవారం కిడ్నాప్కు గురయ్యారు. మరసటి రోజు హర్యానా భివానీలోని లోహరులో కాలిపోయిన బొలేరో వాహనంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. భజరంగ్ ధల్ లో సంబంధం ఉన్న గోసంరక్షకులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ హత్యల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!