Asaduddin Owaisi: గోసంరక్షకులకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది.. భివానీ హత్యలపై అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
ఈ హత్యల్లో మైనారిటీలపై హింస లక్ష్యంగా ఉందని అన్నారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వారే జునైద్, నాసిర్లను హత్యలు చేశారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థికృత ముస్లిం ద్వేషం ప్రబలుతోందని, నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా..? అని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గో రక్షకుల అనే వేషధారణలో ప్రజలను చంపి, దోపిడిలకు పాల్పడుతున్న ఇలాంటి రాడికల్ ఎలిమెంట్స్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని.. ఇలాంటి వారిని ప్రోత్సహించడం మానేయాలని ఓవైసీ అన్నారు.
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
Read Also: Imran Khan: క్యాన్సర్ చికిత్సకు నొప్పి మాత్ర వాడతారా.? పాక్-ఐఎంఎఫ్ డీల్ పై విమర్శలు..
ఈ కేసులో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, పోలీసులు కుమ్మకయ్యరాని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించే వరకు జునైడ్, నసీర్లకు న్యాయం జరగదని అన్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని.. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగదని అన్నారు. మీరు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించవచ్చు. కానీ యూట్యూబ్ లో ఉంటున్న ఇటువంటి నేరాల హింసాత్మక వీడియోలను నిషేధించలేదని అన్నారు.
రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35) బుధవారం కిడ్నాప్కు గురయ్యారు. మరసటి రోజు హర్యానా భివానీలోని లోహరులో కాలిపోయిన బొలేరో వాహనంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. భజరంగ్ ధల్ లో సంబంధం ఉన్న గోసంరక్షకులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ హత్యల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!