Asaduddin Owaisi: గోసంరక్షకులకు బీజేపీ మద్దతుగా నిలుస్తోంది.. భివానీ హత్యలపై అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
ఈ హత్యల్లో మైనారిటీలపై హింస లక్ష్యంగా ఉందని అన్నారు. హిందూ రాష్ట్రాన్ని కోరుకునే వారే జునైద్, నాసిర్లను హత్యలు చేశారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థికృత ముస్లిం ద్వేషం ప్రబలుతోందని, నిందితులపై చర్యలు తీసుకుంటారా లేదా..? అని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గో రక్షకుల అనే వేషధారణలో ప్రజలను చంపి, దోపిడిలకు పాల్పడుతున్న ఇలాంటి రాడికల్ ఎలిమెంట్స్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని.. ఇలాంటి వారిని ప్రోత్సహించడం మానేయాలని ఓవైసీ అన్నారు.
Also Read
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
- Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Read Also: Imran Khan: క్యాన్సర్ చికిత్సకు నొప్పి మాత్ర వాడతారా.? పాక్-ఐఎంఎఫ్ డీల్ పై విమర్శలు..
ఈ కేసులో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ, పోలీసులు కుమ్మకయ్యరాని ఆరోపించారు. హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించే వరకు జునైడ్, నసీర్లకు న్యాయం జరగదని అన్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని.. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగదని అన్నారు. మీరు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించవచ్చు. కానీ యూట్యూబ్ లో ఉంటున్న ఇటువంటి నేరాల హింసాత్మక వీడియోలను నిషేధించలేదని అన్నారు.
రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35) బుధవారం కిడ్నాప్కు గురయ్యారు. మరసటి రోజు హర్యానా భివానీలోని లోహరులో కాలిపోయిన బొలేరో వాహనంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారు. భజరంగ్ ధల్ లో సంబంధం ఉన్న గోసంరక్షకులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ హత్యల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
-
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
-
Diesel: డీజిల్ కొరత, ధరల పెరుగుదల వేళ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన
-
Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!