BJP VS INDIA: సీజేఐ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడంపై రాజకీయ దుమారం..
- గణేష్ పూజ సందర్భంగా సీజేఐ ఇంటికి ప్రధాని మోడీ..
- రాజకీయ దుమారానికి కారణమవుతున్న భేటీ..
- ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లడం చెడు సంకేతాలను పంపుతుందన్న విపక్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP VS INDIA: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం వివాదాస్పదమైంది. గణేష్ పూజ కోసం వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమైంది. విపక్ష నేతలు దీనిని తప్పుపడుతున్నారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లుతుందని చెబుతున్నారు. అయితే, గణపతి పూజకు వెళ్లడం నేరం కాదని, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో అనేక వేదికలను కలిసి పంచుకున్నారని అధికార బీజేపీ ఎదురుదాడి చేసింది.
గణేష్ పూజ కోసం ప్రధాన న్యాయమూర్తి ఇంటికి మోడీ వెళ్లడంతో ఆయన భార్య కల్పనా దాస్ నుంచి ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ‘‘ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జీ నివాసంలో గణేష్ పూజకు హాజరయ్యాను. భగవాన్ గణేష్ మనందరికి ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానున’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. సీజేఐ, ఆయన భార్యతో ఉన్న ఫోటోని ప్రధాని పంచుకున్నారు.
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
దీనిపై శివసేన(యూబీటీ) నేత సంజయ్మ రౌత్ మాట్లాడుతూ.. భేటీపై సందేహాలను లేవనెత్తారు. శివసేన, ఏక్ నాథ్ షిండే మధ్య జరుగుతున్న శివసేన గొడవకు సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పుకోవాలని సూచించారు. ‘‘చూడండి.. ఇది గణపతి పండుగ.. ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో.. నాకు సమాచారం లేదు.. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లి.. ప్రధానమంత్రి మరియు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఆరతి చేసారు, రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే, ప్రజలకు సందేహాలు కలుగుతాయి, ” అని సంజయ్ రౌత్ అన్నారు.
Read Also: Natasha’s Friend: స్నేహితుడితో కారులో నటాషా.. హార్దిక్ తో విడిపోవడానికి కారణం అతడేనా?
ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో ఎంపీ ప్రియాంకా చతుర్వేది కూడా ఈ భేటీపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. శివసేనకు సంబంధించిన కేసు పదేపదే వాయిదా పడటాన్ని ఎత్తి చూపారు. ‘‘ గణపతి పూజ వ్యక్తిగత విషయం, కానీ మీరు కెమెరా ముందుకు తెస్తున్నారు. అది పంపే సందేశం అసౌకర్యంగా ఉంటుంది. ’’ అని ఆర్జేడీ నాయకులు, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.
2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు అప్పటి భారత ప్రధాని న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరైన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. “గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. చాలా సందర్భాలలో న్యాయవ్యవస్థ మరియు రాజకీయ నాయకులు వేదికను పంచుకుంటారు. శుభకార్యాలు, వివాహాలు, కార్యక్రమాలలో – కానీ ప్రధానమంత్రి సిజెఐ ఇంటికి హాజరవుతుంటే, ఉద్ధవ్ సేన ఎంపి సిజెఐ మరియు సుప్రీం కోర్టు యొక్క చిత్తశుద్ధిని అనుమానించారు. కాంగ్రెస్ ఎకో సిస్టమ్ దీనిపై దాడి చేస్తోంది. గతంలో రాహుల్ గాంధీ లాగానే సుప్రీంకోర్టుపై దాడి చేస్తోంది. ఇది కోర్టు ధిక్కారం, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం’’ అని పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!