BJP: అదానీ లంచం ఆరోపణల్లో ప్రతిపక్ష రాష్ట్రాల పేర్లు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్..
- అదానీ లంచం కేసులో 4 ప్రతిపక్ష రాష్ట్రాలు..
- రాహుల్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ పేర్కొంది. గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారని, నరేంద్రమోడీతో చేతులు కలిపారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం అన్నారు.
అదానీ గ్రూప్పై అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని, ఆ సమయంలో ఛత్తీస్గఢ్, తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షమే అధికారంలో ఉన్నాయని చెప్పారు. 2021-2023 మధ్య రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలుగా 265 మిలియన్ డాలర్లు చెల్లించిందని US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. యూఎస్ నేరారోపణ చేసిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, తమిళనాడుతో పాటు ఒడిశా నవీన్ పట్నాయక్ పాలనలో, ఏపీలో వైఎస్ జగన్ పాలనలో ఉంది.
Also Read
Read Also: Home Remedies For Cold: ఈ ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని పొందండి ఇలా
భారతదేశం, భారతదేశాన్ని రక్షించే నిర్మాణాలపై దాడి చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యూహమని అన్నారు. రాహుల్ గాంధీ 2019లో ఇదే తరహాలో రాఫెల్ సమస్యని లేవనెత్తారు, కోవిడ్ సమయంలో వాక్సిన్ పనితీరుని ప్రశ్నించారు.. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.
అంతకుముందు, బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, ఈ ఆరోపణ్ని అదానీ గ్రూప్ ఖండించింది. ఈ అభియోగాలపై భారత్లో రాజకీయ వివాదం కొనసాగుతోంది. గౌతమ్ అదానీ అమెరికా, భాతర చట్టాలను ఉల్లంఘించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Mr Perfect Copyright Case: దిల్రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
-
Google Pixel 11 Series: భారత్లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..