Maharashtra Politics: విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై తీవ్ర దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హారం. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులను ప్రస్తావిస్తూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దాన్వే మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదని.. ఇది చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. నిధులు ఇవ్వని ఎమ్మెల్యేలు.. వారి ప్రాంతాల్లో నివసించే పౌరులు పన్నులు చెల్లించలేదా అని దన్వే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షిండే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని దుయ్యబట్టారు.
Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ మాకు మిత్రులే.. కానీ హరీష్ ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు
Also Read
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
మరోవైపు దాన్వే ఆరోపణలపై.. షిండే వర్గం ఎమ్మెల్యేలు భరత్ గోగ్వాలే, సంజయ్ శిర్సత్ స్పందించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇస్తున్న నిధులు వ్యక్తిగత పనుల కోసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతల కంటే ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వారికే ఎక్కువ నిధులు వస్తాయని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్, నేషనలిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అధికార ఎమ్మెల్యేలకే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఈరోజు తమ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని ప్రయోజనం పొందుతున్నాట్లు తెలిపారు.
Tillu Square: రాధికాతో అంత జరిగినా కూడా సిగ్గు రాలే టిల్లు అన్నకు..
ఎమ్మెల్యేల నిధుల విషయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడిన అంశం తెరపైకి వచ్చింది. తమ ప్రభుత్వంలో ఎవరికీ సమాన నిధులు ఇవ్వలేదని.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని పటోలే అన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వ దివాళాకోరుతనం బయటపడిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..