PM Modi: ఒకేసారి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్.. మోడీ పవర్ ఫుల్ స్పీచ్..
- వన్ నేషన్-వన్ ఎలక్షన్పై మోడీ క్లారిటీ..
- జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు పవర్ ఫుల్ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ ‘‘అర్బన్ నక్సల్ కూటమి’’ని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Narakasura Vadha: ఘనంగా దీపావళి వేడుకలు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్న ఒంగోలు వాసులు
Also Read
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
దేశంలో ‘‘వన్ నేషన్-వన్ సివిల్ కోడ్’’ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా, ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు.
‘‘మేము జీఎస్టీ ద్వారా ఒక దేశం-ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ‘ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా’ పథకాన్ని తీసుకువచ్చాము. ఇప్పుడు, మేము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, వనరులను ఆప్టిమైజ్ చేసే ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ దిశగా పని చేస్తున్నాము. భారతదేశం కూడా ‘ఒక దేశం, ఒకే సివిల్ కోడ్’ దిశగా పయనిస్తోంది.’’ అని అన్నారు. రాజ్యాంగాన్ని జపించే వారు కూడా రాజ్యాంగాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!