PM Modi: ఒకేసారి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్.. మోడీ పవర్ ఫుల్ స్పీచ్..
- వన్ నేషన్-వన్ ఎలక్షన్పై మోడీ క్లారిటీ..
- జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు పవర్ ఫుల్ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ ‘‘అర్బన్ నక్సల్ కూటమి’’ని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Narakasura Vadha: ఘనంగా దీపావళి వేడుకలు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్న ఒంగోలు వాసులు
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
దేశంలో ‘‘వన్ నేషన్-వన్ సివిల్ కోడ్’’ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా, ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు.
‘‘మేము జీఎస్టీ ద్వారా ఒక దేశం-ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ‘ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా’ పథకాన్ని తీసుకువచ్చాము. ఇప్పుడు, మేము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, వనరులను ఆప్టిమైజ్ చేసే ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ దిశగా పని చేస్తున్నాము. భారతదేశం కూడా ‘ఒక దేశం, ఒకే సివిల్ కోడ్’ దిశగా పయనిస్తోంది.’’ అని అన్నారు. రాజ్యాంగాన్ని జపించే వారు కూడా రాజ్యాంగాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!