PM Modi: ఒకేసారి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్.. మోడీ పవర్ ఫుల్ స్పీచ్..
- వన్ నేషన్-వన్ ఎలక్షన్పై మోడీ క్లారిటీ..
- జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు పవర్ ఫుల్ స్పీచ్..
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ ‘‘అర్బన్ నక్సల్ కూటమి’’ని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Narakasura Vadha: ఘనంగా దీపావళి వేడుకలు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్న ఒంగోలు వాసులు
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
దేశంలో ‘‘వన్ నేషన్-వన్ సివిల్ కోడ్’’ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా, ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు.
‘‘మేము జీఎస్టీ ద్వారా ఒక దేశం-ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ‘ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా’ పథకాన్ని తీసుకువచ్చాము. ఇప్పుడు, మేము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, వనరులను ఆప్టిమైజ్ చేసే ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ దిశగా పని చేస్తున్నాము. భారతదేశం కూడా ‘ఒక దేశం, ఒకే సివిల్ కోడ్’ దిశగా పయనిస్తోంది.’’ అని అన్నారు. రాజ్యాంగాన్ని జపించే వారు కూడా రాజ్యాంగాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!