Mamata Banerjee: రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంః మమత బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: |ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఘోర ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి ప్రస్తుతం మానసిక మరియు శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి తమ ప్రభుత్వం నగదు సహాయం చేస్తుందని మమత తెలిపారు. ప్రమాదంలో గాయపడి భువనేశ్వర్ మరియు కటక్ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మమతా బెనర్జీ మంగళవారం పరామర్శించనున్నారు.
Add also: Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
పశ్చిమ బెంగాల్కు చెందిన 206 మంది ప్రయాణికులు గాయపడి ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. కటక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 33 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మంగళవారం తనతోపాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు వస్తారని ఆమె చెప్పారు. బాధితుల బంధువులకు ఎక్స్గ్రేషియా చెక్కులతోపాటు.. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లను మమతా బెనర్జీ బుధవారం పంపిణీ చేయనున్నారు.
Add also: Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
ప్రమాదంపై తాను ఎలాంటి రాజకీయాలను చేయబోనని.. గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణీకుల చికిత్స మరియు పునరావాసాన్ని పర్యవేక్షించడానికి మంగళవారం వెళ్లాలలని నిర్ణయించిన నేపథ్యంలో .. తన నాలుగు రోజుల డార్జిలింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని బెంగాల్ సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం మమత హిల్స్లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులను కలవాల్సి ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మమతా బెనర్జీ డార్జిలింగ్ పర్యటనను కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!