Mamata Banerjee: రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంః మమత బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: |ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఘోర ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి ప్రస్తుతం మానసిక మరియు శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి తమ ప్రభుత్వం నగదు సహాయం చేస్తుందని మమత తెలిపారు. ప్రమాదంలో గాయపడి భువనేశ్వర్ మరియు కటక్ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మమతా బెనర్జీ మంగళవారం పరామర్శించనున్నారు.
Add also: Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే
Also Read
పశ్చిమ బెంగాల్కు చెందిన 206 మంది ప్రయాణికులు గాయపడి ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. కటక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 33 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మంగళవారం తనతోపాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు వస్తారని ఆమె చెప్పారు. బాధితుల బంధువులకు ఎక్స్గ్రేషియా చెక్కులతోపాటు.. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లను మమతా బెనర్జీ బుధవారం పంపిణీ చేయనున్నారు.
Add also: Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
ప్రమాదంపై తాను ఎలాంటి రాజకీయాలను చేయబోనని.. గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణీకుల చికిత్స మరియు పునరావాసాన్ని పర్యవేక్షించడానికి మంగళవారం వెళ్లాలలని నిర్ణయించిన నేపథ్యంలో .. తన నాలుగు రోజుల డార్జిలింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని బెంగాల్ సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం మమత హిల్స్లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులను కలవాల్సి ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మమతా బెనర్జీ డార్జిలింగ్ పర్యటనను కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Iran-US: ‘హార్ముజ్ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
-
BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
-
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!