Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
- వందేమాతరం వివాదంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్..
- సోనియా, రాహుల్ గాంధీలపై ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నించిన ఖర్గే..
- ఇలా అయితే గాంధీ, నెహ్రూలపై కేసులు పెట్టాలని వ్యాఖ్య..
- వందేమాతరాన్ని సోనియా గాంధీ ఆపలేదని కాంగ్రెస్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Row: వందేమాతరం వివాదం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘‘వందేమాతరం’’ గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వందేమాతరం పాత వెర్షన్ పాడటం నేరమైతే, అదే పాటను ఆలపించిన మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయిలపై కూడా కేసులు పెట్టాలని ఖర్గే అన్నారు. వందేమాతరం పాడకుండా సోనియాగాంధీ అడ్డుకున్నారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది.
Also Read
ఖర్గే ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితిలో ఉన్నందున ఆయనకు కుర్చీ వేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సంకేతం ఇచ్చారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం ఆపాలని ఆమె సూచించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై సోనియా, రాహుల్ గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ వివాదంపై ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ, నెహ్రూలు పాడిన పాత వెర్షన్ అని చెప్పారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ ఇదే విధానంలో జాతీయ గీతాన్ని ఆలపిస్తోందని, ఇది నేరమైతే గాంధీ, నెహ్రూలపై కూడా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ వివాదం మధ్య సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే వందేమాతరం తొలి రెండు చరణాలు ఆలపించారు. ఈ ఏడాది కేంద్రం బహిరంగ సమావేశాలు, పాఠశాలల్లో, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. పాటను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గౌరవానికి భంగం కలిగించడం నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది.
తాజావార్తలు
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!