Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy On Chandrababu Naidu Political Alliances: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలయికపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పందించారు. అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. చంద్రబాబు చేస్తోంది మోసమని ఆరోపించారు. పొత్తుల విషయంలో తమకు స్పష్టమైన విధానం ఉందని.. కూటములు, పొత్తులకు సిద్ధాంతాలు ఉండాలని అన్నారు. 2014లో జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాయని.. తర్వాత అదే చంద్రబాబు వాళ్లపై ఆరోపణలు వేసి, బయటకు వచ్చాడని వ్యాఖ్యానించారు.
Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
జగన్కు ప్రజల్లో ఆదరణ లేదని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. జగన్కు ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లతో పాటు ఓట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేసింది. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని తేల్చి చెప్పారు. మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న విషయం.. అన్నీ సర్వేల్లోనూ తేలుతోందని చెప్పారు. తమకు చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఒంటరిగా పోటీ చేసి, గత ఎన్నికల్లో కంటే గొప్ప విజయాన్ని నమోదు చేస్తామని నమ్మకంగా చెప్పారు.
Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే
అంతకుముందు కూడా.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడని, టీడీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ పొగిడారని.. చంద్రబాబు తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని.. మరి ఇప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులే అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!