Mamata Banerjee: లైంగిక వేధింపుల ఆరోపణ.. ప్రధాని, గవర్నర్పై మమతా బెనర్జీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్ఖాలీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై గవర్నర్, మమతా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సందేశ్ఖాలీ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన గవర్నర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఆరోపణల్ని గవర్నర్ కొట్టిపారేశారు.
Read Also: Palestine protest: ఆంక్షలు ఎదుర్కొంటున్న అమెరికా విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదుల బిగ్ ఆఫర్….
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
శుక్రవారం బర్ధమాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని సందేశ్ఖాలీపై చాలా సందేశాలు ఇచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అది భూమి సమస్య, దాన్ని మేం పరిస్కరించాం. కానీ నిన్న రాజ్ భవన్లో పనిచేస్తున్న ఓ యువతి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇలాంటి సంఘటనలు చాలా విన్నా కానీ, నిన్న బాధితురాలి కన్నీళ్లు నా గుండెను తాకాయి. సందేశ్ఖాలీ గురించి మాట్లాడే గవర్నర్ తన వద్ద పనిచేసే వ్యక్తిపై ఎందుకు ఇలా ప్రవర్తించారు.’’ అని అన్నారు. మహిళ వాంగ్మూల వీడియో తాను చూశానని, బెంగాల్లో ఉండీ, రాత్రి రాజ్ భవన్లో బస చేసిన ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజ్ భవన్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి గురువారం గవర్నర్పై ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తిరస్కరించారు. తనపై కట్టుకథలుగా కొట్టిపారేవారు. నన్ను ఎవరైనా కించపరడచం ద్వారా ఎన్నికల ప్రయోజనాలు కోరుకుంటే వారిని దేవుడు చూసుకుంటాడని, కానీ బెంగాల్ అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఆపనని ఆయన గురువారం అన్నారు. తనపై కొన్ని రాజకీయ శక్తులు ఆరోపణలు చేస్తున్నాయని శుక్రవారం మరోసారి ఆరోపించారు. ఇది సీఎం మమతా బెనర్జీ హేయమైన కుట్రగా బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?