Mamata Banerjee: లైంగిక వేధింపుల ఆరోపణ.. ప్రధాని, గవర్నర్పై మమతా బెనర్జీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్ఖాలీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై గవర్నర్, మమతా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సందేశ్ఖాలీ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన గవర్నర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఆరోపణల్ని గవర్నర్ కొట్టిపారేశారు.
Read Also: Palestine protest: ఆంక్షలు ఎదుర్కొంటున్న అమెరికా విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదుల బిగ్ ఆఫర్….
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
శుక్రవారం బర్ధమాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని సందేశ్ఖాలీపై చాలా సందేశాలు ఇచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అది భూమి సమస్య, దాన్ని మేం పరిస్కరించాం. కానీ నిన్న రాజ్ భవన్లో పనిచేస్తున్న ఓ యువతి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇలాంటి సంఘటనలు చాలా విన్నా కానీ, నిన్న బాధితురాలి కన్నీళ్లు నా గుండెను తాకాయి. సందేశ్ఖాలీ గురించి మాట్లాడే గవర్నర్ తన వద్ద పనిచేసే వ్యక్తిపై ఎందుకు ఇలా ప్రవర్తించారు.’’ అని అన్నారు. మహిళ వాంగ్మూల వీడియో తాను చూశానని, బెంగాల్లో ఉండీ, రాత్రి రాజ్ భవన్లో బస చేసిన ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజ్ భవన్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి గురువారం గవర్నర్పై ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తిరస్కరించారు. తనపై కట్టుకథలుగా కొట్టిపారేవారు. నన్ను ఎవరైనా కించపరడచం ద్వారా ఎన్నికల ప్రయోజనాలు కోరుకుంటే వారిని దేవుడు చూసుకుంటాడని, కానీ బెంగాల్ అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఆపనని ఆయన గురువారం అన్నారు. తనపై కొన్ని రాజకీయ శక్తులు ఆరోపణలు చేస్తున్నాయని శుక్రవారం మరోసారి ఆరోపించారు. ఇది సీఎం మమతా బెనర్జీ హేయమైన కుట్రగా బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!