West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
- అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా..
- పోలీసుల సోదాలతో ఉద్రిక్త వాతావరణం..
- విషయం తెలిసి మేనల్లుడి ఇంటికి మమత పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. సుమిత్ రాయ్పై అక్రమ వసూళ్ల కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
పోలీసులు అభిషేక్ ఇంటికి చేరుకుని సెర్చ్ చేయాలని కోరగా, ఆయన సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కొంత సేపు వాగ్వాదం తర్వాత పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మాజీ సీఎం, టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ హుటాహుటిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి పరుగులు పెట్టారు. ఆమె అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం తర్వాత మమత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే, శనివారం ఉదయం ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
Also Read
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
అభిషేక్ సహాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీపై ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో విచారణ జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విద్వేషపూరిత ప్రసంగంపై సీఐడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించిన తీర్మానంపై పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని కూడా సీఐడీ విచారిస్తోంది. మరోవైపు, టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మదన్ మిత్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మున్సిపల్ నియామక కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?