West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
- అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా..
- పోలీసుల సోదాలతో ఉద్రిక్త వాతావరణం..
- విషయం తెలిసి మేనల్లుడి ఇంటికి మమత పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. సుమిత్ రాయ్పై అక్రమ వసూళ్ల కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
పోలీసులు అభిషేక్ ఇంటికి చేరుకుని సెర్చ్ చేయాలని కోరగా, ఆయన సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కొంత సేపు వాగ్వాదం తర్వాత పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మాజీ సీఎం, టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ హుటాహుటిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి పరుగులు పెట్టారు. ఆమె అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం తర్వాత మమత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే, శనివారం ఉదయం ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
Also Read
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
అభిషేక్ సహాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీపై ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో విచారణ జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విద్వేషపూరిత ప్రసంగంపై సీఐడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించిన తీర్మానంపై పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని కూడా సీఐడీ విచారిస్తోంది. మరోవైపు, టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మదన్ మిత్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మున్సిపల్ నియామక కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!