Delhi Acid Attack: ఫ్లిప్కార్ట్లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్కార్టుకి DCW నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Acid Attack: ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 17 ఏళ్ల అమ్మాయిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు నిందితుడు. బుధవారం ఉదయం రోడ్డుపై చెల్లితో నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిపై ఇద్దరు నిందితులు బైక్ పై వచ్చి ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ కేసులో బాధితురాలుకు తెలిసిన ఇద్దరు వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన వివరాలతో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. దాడికి ఉపయోగించిన యాసిడ్ ను ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
Read Also: Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్
Also Read
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఈ దాడిలో బాలిక ముఖం, మెడపై 8 శాతం కాలిన గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితురాలు 12 తరగతి చదువుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. కాలిన గాయాలు ఎంత వరకు చర్మంపై ప్రభావం చూపించాయనే విషయం నిర్థారించేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్ అరోరా, బాలికతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయితే మూడు నెలల క్రితం వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. దీంతో బాలికపై పగ పెంచుకున్న సచిన్ తన ఇద్దరు మిత్రులు హర్షిత్, వీరేంద్రలతో కలిసి దాడికి ప్లాన్ చేశారు. ఫ్లిప్కార్ట్ నుండి ఆన్లైన్లో యాసిడ్ను ఆర్డర్ చేసాడు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(DCW) సీరియస్ అయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఆన్లైల్ లో యాసిడ్ అమ్మకాలపై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు నోటీసులు జారీ చేసింది. యాసిడ్ దాడులు పెరగడంతో యాసిడ్ విక్రయాలపై 2013లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయినా అమ్మకాలు జరుగుతుండటంపై సీరియస్ అయింది. కూరగాయలు కొనుగోలు చేసినంత సులువుగా యాసిడ్ లభిస్తుందని ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!