Himanta Biswa Sarma: బాల్య వివాహాలు, బహుభార్యత్వం వదులుకోవాలి.. “మిమా ముస్లిం”లకు సీఎం షరతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ఈ నెల ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని ప్రజలు కొన్ని సాంస్కృతిక పద్ధతులు మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హిమంత శర్మ నొక్కి చెప్పారు. కుటుంబం ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని, బహుభార్యత్వాన్ని నిలిపేయాలని, మైనర్ కుమార్తెల వివాహాలను నిరోధించాలని మియా ముస్లింలకు స్పష్టం చేశారు.
Read Also: RKS Bhadauria: బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా..
Also Read
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
‘‘మియాలు(బెంగాలీ మాట్లాడే ముస్లింలు) స్థానికులా, కాదా అనేది వేరే విషయం. మనం చెప్పేది ఏంటంటే, వారు స్వదేశీగా ఉండటానికి ప్రయత్నిస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ దాని కోసం వారు బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వదులుకోవాలి. మహిళల విద్యను ప్రోత్సహించాలి’’ అని శనివారం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. అస్సామీ సాంస్కృతిక విలువను గౌరవించడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. కొన్ని సమూహాలు ‘సత్రాల’(వైష్ణవ మఠాలు) భూములను ఆక్రమించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. మియాలు స్వదేశీయులు కావడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వారికి ఇద్దరు, ముగ్గురు భార్యలు ఉండకూడదు, అది అస్సామీ సంస్కృతి కాదు. వైష్ణమ మఠాల భూమిని ఎలా ఆక్రమించుకుని స్వదేశీయులుగా ఉండాలని అనుకుంటున్నారు..? అని సీఎం ప్రశ్నించారు. మియాలు మదర్సాలకు దూరంగా ఉండాలని, వారు మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అస్సాంలోని హిమంత శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2022లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చింది. అనేక మంది వృద్ధులు పలుమార్లు వివాహం చేసుకున్నారని, వారి భార్యలు ఎక్కువ యవతే అని, సమాజంలోని పేద వర్గానికి చెందిన యువతే ఉన్నారని హిమంత ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఫిబ్రవరి 2023లో 3483 మందిని అరెస్ట్ చేసి 4515 కేసులు పెట్టింది. అక్టోబర్ నెలలో 915 మందిని పట్టుకుని 710 కేసులు నమోదు చేసింది. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్కి చెందిన ముస్లింలు (1971కి ముందు తూర్పు పాకిస్తాన్) నుంచి అస్సాంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. అస్సాంలోని 126 నియోజకవర్గాలకు గానూ 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!