Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు.. అధ్యయనంలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Vaccine: భారతదేశంలో కోవిడ్-19 నివారణకు ఉపయోగిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు, గుండె పోటులకు ఎలాంటి సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల గుండె పోటు వస్తుందనే వార్తల నేపథ్యంలో ఈ స్టడీ తన ఫలితాలను నివేదించింది. కోవిషీల్డ్, కోవాక్సిన్ హర్ట్ ఎటాక్స్ మధ్య సంబంధంపై నిర్వహించిన అధ్యయనాన్ని PLOS One జర్నల్లో ఇటీవల ప్రచురించబడింది. మయోకార్డియల్ ఇన్పార్క్షన్ (గుండెపోటు)పై టీకాల ప్రభావాన్ని అధ్యయనం చేసింది.
ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్ లో ఆగస్టు 2021, ఆగస్టు 2022 మధ్య చేరిన 1578 మందిపై ఈ స్టడీని నిర్వహించారు. ఇందులో 1086(68.8 శాతం) మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. 492(31.2 శాతం) మందికి వ్యాక్సిన్లు ఇవ్వలేదు. టీకా తీసుకున్న వారిలో 1047 మంది రెండు డోసులు తీసుకోగా.. 39 మంది ఒకే డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
Read Also: Pushkar Singh Dhami: ‘భారత రాష్ట్రపతి’ అనే పదాన్ని వాడడం దేశప్రజలకు గర్వకారణం
ఈ అధ్యయనం ద్వారా టీకాలు సురక్షితమైనవిగా తేలాయని, వ్యాక్సిన్లకు-గుండెపోట్లకు సంబంధం లేదని, నిజానికి వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో గుండె పోటుతో మరణించే అవకాశాలు తగ్గాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన మోహిత్ గుప్తా తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ల రియాక్షన్స్ చాలా వరకు తేలికపాటివని, తాత్కాలికమైనవని తెలిపారు. అయితే వీటి వల్ల గుండెపోటు సంభవిస్తుందనే వాదన ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది.
తాజా అధ్యయనంలో రోగులకు ఇచ్చిన వ్యాక్సిన్, తేదీ, దాని వల్ల వచ్చే ప్రతీకూల ప్రభావాలతో సహా రోగికి సంబంధించిన పూర్తి డేటాను నమోదు చేశారు. 30 రోజుల రోగుల ఫాలో అప్ లో 201 రోగులలో అన్ని కారణాల వల్ల మరణాలు సంభవించాయి. టీకాలు తీసుకున్న వారిలో మరణాల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే విధంగా ఆరు నెలల పరిశీలనలో టీకాలు వేయని వారిలో పోలిస్తే టీకాలు తీసుకున్న వారిలో మరణాల సంభావ్యత తక్కువగా ఉన్నట్లు తేలింది. వయోభారం, మధుమేహం, ధూమపానం చేసేవారిలో 30 రోజుల మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది సింగిల్ సెంటర్ రెట్రోస్పెక్టివ్ అధ్యయనం అని.. వివిధ జాతుల సమూహాల నుంచి పెద్ద సంఖ్యలో అధ్యయనం చేసి ధృవీకరించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..