Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్లో దాడి..
- భారతీయ వ్యక్తిపై బంగ్లాదేశ్లో దాడి..
- హిందువు మా దేశం ఎందుకు వచ్చావంటూ అటాక్..
- దాడి గురించి రిపోర్ట్ చేసినా పట్టించుకోని అధికారులు..
- భారతీయులు ఎవరూ ఆ దేశం వెళ్లొద్దని కోరిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు.
21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి ఐస్క్రీమ్ తింటుండగా, అక్కడికి చేరుకున్న గుంపు అతడి గుర్తింపు, దేశం, మతం అడిగి దాడికి పాల్పడ్డారు. తాను ఇండియాకు చెందిన వాడనిని హిందువు అని చెప్పడంతో దాడి మొదలైంది. మతోన్మాద మూక సయన్ని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి నా పర్సు, డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారని, కత్తితో రాళ్లతో దాడి చేశారు. తన స్నేహితుడిపై దాడిని అపేందుకు ప్రయత్నించిన ఆ దేశానికి చెందిన వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
Read Also: Syria Crisis: సంక్షోభం దిశగా సిరియా.. రష్యా ఆదుకునేనా.. రెబల్స్ దూకుడు..
‘‘ఒక భారతీయ హిందువు మా దేశానికి ఎందుకు వచ్చాడు..?’’ అని దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల జనాలు కూడా సాయం చేయలేదు. స్థానిక అధికారులు కూడా తనకు సాయం చేయలేదని ఘోష్ అన్నారు. తాను బంగ్లాదేశ్ ఎమర్జెన్సీ నంబర్కి కాల్ చేశానని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు బదులుగా తనపైనే ఆరోపణలు చేసినట్లు ఘోష్ చెప్పాడు. ఘటన జరిగిన తర్వాతి రోజు కొంతమంది స్థానికులు తన స్నేహితుడి ఇంటికి వచ్చి మరొసారి వచ్చి బెదిరించారని చెప్పాడు. భారతీయ హిందువులు ఎవరూ బంగ్లాదేశ్ వెళ్లొద్దని, సురక్షితం కాదని చెప్పాడు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ మైనారిటీలను ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మతోన్మాద మూక దాడులకు పాల్పడుతున్నారు.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..