Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్లో దాడి..
- భారతీయ వ్యక్తిపై బంగ్లాదేశ్లో దాడి..
- హిందువు మా దేశం ఎందుకు వచ్చావంటూ అటాక్..
- దాడి గురించి రిపోర్ట్ చేసినా పట్టించుకోని అధికారులు..
- భారతీయులు ఎవరూ ఆ దేశం వెళ్లొద్దని కోరిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన భారతీయ యువకుడికి బంగ్లాదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్లోని బెల్ఘరియా నివాసి సయన్ ఘోష్ తన స్నేహితుడిని కలిసేందుకు నవంబర్ 23న ఢాకా వెళ్లాడు. అయితే, నవంబర్ 26న తిరిగి భారతదేశానికి వచ్చే సమయంలో ఆయన దాడికి గురయ్యాడు.
21 ఏళ్ల యువకుడు సయన్ ఘోష్ ఢాకాలోని బగన్బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి ఐస్క్రీమ్ తింటుండగా, అక్కడికి చేరుకున్న గుంపు అతడి గుర్తింపు, దేశం, మతం అడిగి దాడికి పాల్పడ్డారు. తాను ఇండియాకు చెందిన వాడనిని హిందువు అని చెప్పడంతో దాడి మొదలైంది. మతోన్మాద మూక సయన్ని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి నా పర్సు, డబ్బు, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారని, కత్తితో రాళ్లతో దాడి చేశారు. తన స్నేహితుడిపై దాడిని అపేందుకు ప్రయత్నించిన ఆ దేశానికి చెందిన వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డారు.
Also Read
- Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
- Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Read Also: Syria Crisis: సంక్షోభం దిశగా సిరియా.. రష్యా ఆదుకునేనా.. రెబల్స్ దూకుడు..
‘‘ఒక భారతీయ హిందువు మా దేశానికి ఎందుకు వచ్చాడు..?’’ అని దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల జనాలు కూడా సాయం చేయలేదు. స్థానిక అధికారులు కూడా తనకు సాయం చేయలేదని ఘోష్ అన్నారు. తాను బంగ్లాదేశ్ ఎమర్జెన్సీ నంబర్కి కాల్ చేశానని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు బదులుగా తనపైనే ఆరోపణలు చేసినట్లు ఘోష్ చెప్పాడు. ఘటన జరిగిన తర్వాతి రోజు కొంతమంది స్థానికులు తన స్నేహితుడి ఇంటికి వచ్చి మరొసారి వచ్చి బెదిరించారని చెప్పాడు. భారతీయ హిందువులు ఎవరూ బంగ్లాదేశ్ వెళ్లొద్దని, సురక్షితం కాదని చెప్పాడు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ మైనారిటీలను ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ మతోన్మాద మూక దాడులకు పాల్పడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
OTR: గద్వాలలో ప్రోటోకాల్ వార్.. ఎమ్మెల్యే vs కార్పొరేషన్ చైర్పర్సన్!
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?