Amit Shah: బీహార్లో బీజేపీని గెలిపించండి.. అల్లరి మూకలను తలకిందులుగా వేలాడదీస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: సీఎం నితీష్ కుమార్ అధికార దాహం వల్లే లాలా ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్ నవడాలో పర్యటించిన ఆయన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నవడా జిల్లాలోని హిసువా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీహార్ లో రామనవమి రోజుల చెలరేగిన మతఘర్షణల గురించి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న ప్రభుత్వం బీహార్ లో శాంతిని నెలకొల్పుతుందా..? అని ప్రశ్నించారు.
Read Also: SRH vs RR: 10 ఓవర్లలో రాజస్థాన్ స్కోర్ ఇది.. తాండవం చేసిన ఓపెనర్స్
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
నేను ససారం వెళ్లాల్సి ఉంది, అయితే దురదృష్టవశాత్తు అక్కడ మతఘర్షణలు చెలరేగాయి. ప్రజలు చంపబడుతున్నారు, బుల్లెట్ల కాల్పలు, టియర్ గ్యాస్ షెల్లింగ్ జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు. జేడీయూ నేతలకు ఎన్డీయే తలుపులు మూసుకుపోయాయని ఆయన జేడీయూతో ఇకపై బంధం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు ఆశలతో జీవిస్తున్నారని, నితీష్ కుమార్ ప్రధాని కలలు నెరవేరవు అని అమిత్ షా అన్నారు. లాలూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ లో జంగిల్ రాజ్ తిరిగి వచ్చిందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ వ్యతిరేకించాయని, కానీ మోదీ అక్కడ ఆకాశమంత ఎతైన ఆలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.
ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత హింసను అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. 2025లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అల్లరిమూకలను తలకిందులుగా వేలాడదీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీహార్ లో చెలరేగిన మతఘర్షణలు సమసిపోవాలని కోరారు. అంతకుముందు ససారం వెళ్లాల్సిన అమిత్ షా, మతఘర్షణల కారణంగా అక్కడ 144 సెక్షన్ విధించడం వల్ల ఆయన పర్యటన రద్దు అయింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!