Amit Shah: బీహార్లో బీజేపీని గెలిపించండి.. అల్లరి మూకలను తలకిందులుగా వేలాడదీస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: సీఎం నితీష్ కుమార్ అధికార దాహం వల్లే లాలా ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీహార్ నవడాలో పర్యటించిన ఆయన జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాఘటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం నవడా జిల్లాలోని హిసువా ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీహార్ లో రామనవమి రోజుల చెలరేగిన మతఘర్షణల గురించి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంగిల్ రాజ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో ఉన్న ప్రభుత్వం బీహార్ లో శాంతిని నెలకొల్పుతుందా..? అని ప్రశ్నించారు.
Read Also: SRH vs RR: 10 ఓవర్లలో రాజస్థాన్ స్కోర్ ఇది.. తాండవం చేసిన ఓపెనర్స్
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
నేను ససారం వెళ్లాల్సి ఉంది, అయితే దురదృష్టవశాత్తు అక్కడ మతఘర్షణలు చెలరేగాయి. ప్రజలు చంపబడుతున్నారు, బుల్లెట్ల కాల్పలు, టియర్ గ్యాస్ షెల్లింగ్ జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు. జేడీయూ నేతలకు ఎన్డీయే తలుపులు మూసుకుపోయాయని ఆయన జేడీయూతో ఇకపై బంధం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు ఆశలతో జీవిస్తున్నారని, నితీష్ కుమార్ ప్రధాని కలలు నెరవేరవు అని అమిత్ షా అన్నారు. లాలూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ లో జంగిల్ రాజ్ తిరిగి వచ్చిందని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ వ్యతిరేకించాయని, కానీ మోదీ అక్కడ ఆకాశమంత ఎతైన ఆలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.
ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత హింసను అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. 2025లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అల్లరిమూకలను తలకిందులుగా వేలాడదీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీహార్ లో చెలరేగిన మతఘర్షణలు సమసిపోవాలని కోరారు. అంతకుముందు ససారం వెళ్లాల్సిన అమిత్ షా, మతఘర్షణల కారణంగా అక్కడ 144 సెక్షన్ విధించడం వల్ల ఆయన పర్యటన రద్దు అయింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!