Nitish Kumar: నిజాయితీగా సేవ చేశా.. మరొక అవకాశం ఇవ్వాలని నితీష్ వీడియో సందేశం
- నిజాయితీగా ప్రజలకు సేవ చేశా
- బీహార్ ఓటర్లకు నితీష్ కుమార్ వీడియో సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.
ఇది కూడా చదవండి: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
Also Read
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
మూడు నిమిషాల వీడియోలో.. 2005లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన దగ్గర నుంచి జరిగిన విషయాలను ప్రస్తావించారు. ‘‘నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా.. 2005 నుంచి మీకు సేవ చేయడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో బీహార్ను చూసి అవమానం పొందాం. ఆ తర్వాత మేము నిజాయితీగా.. కష్టపడి పనిచేసి మీకు పగలు-రాత్రి సేవ చేశాము.’’ అని గుర్తుచేశారు. మరోసారి అధికారం ఇస్తే.. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, యువతకు అవకాశాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వం మహిళల కోసం ఎలాంటి పని చేయలేదు. ఇప్పుడు మేము మహిళలను చాలా బలంగా మార్చాం. మహిళలు ఇకపై ఎవరిపైనా ఆధారపడరు. వారి కుటుంబాలు, పిల్లల కోసం అన్ని పనులు చేయగలరు. మేము మొదటి నుంచి సమాజంలోని అన్ని తరగతులను అభివృద్ధి చేశామని మీకు చెప్పాలనుకుంటున్నాము.’’ అని వివరించారు.
ఇది కూడా చదవండి: JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
‘‘మీరు హిందువు అయినా, ముస్లిం అయినా, అగ్ర కులమైనా, వెనుకబడిన వారైనా, దళితుడైనా, మహాదళితుడైనా.. మేము అందరి కోసం పనిచేశాము. నా కుటుంబం కోసం నేను ఏమీ చేయలేదు.’’ అని తెలిపారు. ‘‘మాకు ఇంకో అవకాశం ఇవ్వండి. దీని తర్వాత మరిన్ని పనులు జరుగుతాయి. దీని వల్ల బీహార్ అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుంది.’’ అని నితీష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
బీహార్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.
प्रिय प्रदेशवासियो,
आइए मिलकर बनाएं नया बिहार।@NitishKumar #Bihar #NitishKumar #JDU #JanataDalUnited #25Se30FirSeNitish pic.twitter.com/XxTqqVaWTp
— Janata Dal (United) (@Jduonline) November 1, 2025
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!