Nitish Kumar: బీజేపీ ఓటమే లక్ష్యం నితీష్ పర్యటన.. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహర్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమితో బీజేపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి మహాఘటబంధన్ లాగే జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి కట్టేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. ఈ వారంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలను ముంబైలో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం
Also Read
- Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
- Bangladesh: బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
గురువారం వీరిద్దరిని కలిసేందుకు నితీష్ కుమార్ ముంబై వెళ్తారని సమాచారం. ఇటీవల మహరాష్ట్రలో ఎన్సీపీలో సంక్షోభానికి శరద్ పవార్ స్వస్తి పలికారు. ఆయన ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ నేతలు దీనికి ఒప్పుకోకపోవడంతో ఆయన మళ్లీ పదవిని చేపట్టారు. బీజేపీ వైపు చూస్తున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను అడ్డుకునేందుకు శరద్ పవార్ ఇలా ప్లాన్ చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఒడిశా పర్యటనను బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు. ఈ పర్యటన విఫలం అయిందని అన్నారు. భువనేశ్వర్ లో నితీష్ కుమార్ తో భేటీ తర్వాత నవీన్ పట్నాయక్ ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పడం ఇది విపక్షాల ఐక్యతకు పెద్ద కుదుపు అని ఆయన అన్నారు. బీహార్ భవన్ ఏర్పాటు కోసం ఒడిశా వెళ్లినట్లు నితీష్ కుమార్ చెప్పడాన్ని సుశీల్ కుమార్ మోడీ ఎగతాళి చేశారు. పవార్, ఉద్దవ్ ఠాక్రేలను కలిసేందుకు ముంబైకి వెళ్తున్న ఆయన ముంబైలో బీహార్ భవన్ కోసం వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!