Nitish Kumar: బీజేపీ ఓటమే లక్ష్యం నితీష్ పర్యటన.. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహర్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమితో బీజేపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి మహాఘటబంధన్ లాగే జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి కట్టేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మంగళవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. ఈ వారంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలను ముంబైలో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
గురువారం వీరిద్దరిని కలిసేందుకు నితీష్ కుమార్ ముంబై వెళ్తారని సమాచారం. ఇటీవల మహరాష్ట్రలో ఎన్సీపీలో సంక్షోభానికి శరద్ పవార్ స్వస్తి పలికారు. ఆయన ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ నేతలు దీనికి ఒప్పుకోకపోవడంతో ఆయన మళ్లీ పదవిని చేపట్టారు. బీజేపీ వైపు చూస్తున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను అడ్డుకునేందుకు శరద్ పవార్ ఇలా ప్లాన్ చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఒడిశా పర్యటనను బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు. ఈ పర్యటన విఫలం అయిందని అన్నారు. భువనేశ్వర్ లో నితీష్ కుమార్ తో భేటీ తర్వాత నవీన్ పట్నాయక్ ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పడం ఇది విపక్షాల ఐక్యతకు పెద్ద కుదుపు అని ఆయన అన్నారు. బీహార్ భవన్ ఏర్పాటు కోసం ఒడిశా వెళ్లినట్లు నితీష్ కుమార్ చెప్పడాన్ని సుశీల్ కుమార్ మోడీ ఎగతాళి చేశారు. పవార్, ఉద్దవ్ ఠాక్రేలను కలిసేందుకు ముంబైకి వెళ్తున్న ఆయన ముంబైలో బీహార్ భవన్ కోసం వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!