Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్కు చెందిన ఇద్దరికి, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం(హిందుస్తానీ అవామ్ మోర్చా) నుంచి ఒకరికి, మరో స్వతంత్ర సభ్యుడికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. బిహార్ కేబినెట్లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.
ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రుల్లో ఒకరిని మినహాయించి అందరినీ కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిత్రపక్షమైన ఆర్జేడీ నుంచి సీనియర్ నాయకులకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇల్లు, ఆర్థిక, పన్నులు, రోడ్డు నిర్మాణం వంటి ప్లం పోర్ట్ఫోలియోలు ఎటువైపు వెళ్తాయో ఇంకా తెలియరాలేదు. గత ప్రభుత్వంలో నితీష్ కుమార్ హోంశాఖను ఆయనే నిర్వహించారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!
మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్కు ఆరోగ్యం, ఆర్థికం, రహదారుల నిర్మాణం వంటి శాఖలు అప్పగించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ శాఖలు గతంలో బీజేపీకి సంబంధించిన నేతలు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది.నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి విడిపోయి, ఆర్జేడీ,కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు రాగా.. బీజేపీతో కలిసి నితీష్కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. హోంమంత్రి అమిత్ షా తన పార్టీని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీతో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసిన మహారాష్ట్ర మోడల్ను బీజేపీ పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన భావించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..