Bihar Cabinet: నేడే బిహార్ మంత్రివర్గ విస్తరణ.. సింహభాగం ఆర్జేడీకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్కు చెందిన ఇద్దరికి, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం(హిందుస్తానీ అవామ్ మోర్చా) నుంచి ఒకరికి, మరో స్వతంత్ర సభ్యుడికి కూడా మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. బిహార్ కేబినెట్లో గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.
ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీ నుంచి గతంలో ఉన్న మంత్రుల్లో ఒకరిని మినహాయించి అందరినీ కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిత్రపక్షమైన ఆర్జేడీ నుంచి సీనియర్ నాయకులకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇల్లు, ఆర్థిక, పన్నులు, రోడ్డు నిర్మాణం వంటి ప్లం పోర్ట్ఫోలియోలు ఎటువైపు వెళ్తాయో ఇంకా తెలియరాలేదు. గత ప్రభుత్వంలో నితీష్ కుమార్ హోంశాఖను ఆయనే నిర్వహించారు.
Also Read
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
- INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
Free Sanitary Products: మహిళలకు శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందిస్తున్న తొలిదేశం ఇదే..!!
మహాకూటమి ప్రభుత్వంలో తేజస్వీ యాదవ్కు ఆరోగ్యం, ఆర్థికం, రహదారుల నిర్మాణం వంటి శాఖలు అప్పగించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ శాఖలు గతంలో బీజేపీకి సంబంధించిన నేతలు నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది.నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి విడిపోయి, ఆర్జేడీ,కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు రాగా.. బీజేపీతో కలిసి నితీష్కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. హోంమంత్రి అమిత్ షా తన పార్టీని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీతో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివసేన సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసిన మహారాష్ట్ర మోడల్ను బీజేపీ పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన భావించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
-
China: స్పేస్ వార్కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
-
Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!