Bihar: ఎన్నికల ముందు నితీష్ కుమార్ కీలక నిర్ణయం..! త్వరలో కేబినెట్ విస్తరణ
- ఎన్నికల ముందు నితీష్ కుమార్ కీలక నిర్ణయం!
- త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమితో సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కేబినెట్ విస్తరణకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రెవెన్యూ మంత్రి పదవికి దిలీప్ జైస్వాల్ బుధవారం రాజీనామా చేశారు. బీహార్లో బడ్జెట్ సమావేశాలకు కేవలం రెండు రోజుల ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో బీహార్లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఒకే వ్యక్తి.. ఒకే పదవి సూత్రంతో మంత్రి పదవి నుంచి వైదొలిగినట్లు దిలీప్ జైస్వాల్ పేర్కొన్నారు. బీజేపీ సూత్రాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణ.. నితీష్ కుమార్ హక్కు అన్నారు.
Also Read
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ఇది కూడా చదవండి: Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ
ఇదిలా ఉంటే నితీష్ కుమార్.. మంత్రివర్గ విస్తరణకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఐదు లేదా ఆరుగురు మంత్రులు ఉండే అవకాశం ఉందని, కనీసం నలుగురు బీజేపీకి చెందినవారుంటారని వర్గాలు తెలిపాయి. సంజయ్ సరోగి, రాజు సింగ్, అవధేష్ పటేల్, జిబేష్ కుమార్, అనిల్ శర్మ వంటి ఎమ్మెల్యేలకు నితీష్ మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అక్టోబర్ లేదా నవంబర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నితీష్కుమార్ పేరు ప్రకటించాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే దీనికి బీజేపీ సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. దీంతో సీఎం పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూకి సీట్లు తక్కువగా ఉన్నా… ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. ఈసారి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Vemulawada Temple: రాజన్న మోస్ట్ పవర్ ఫుల్.. దేశ ప్రజలు వేములవాడకి వెళ్లాలనుకుంటున్నారు: బండి సంజయ్
తాజావార్తలు
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
-
Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..