Tamil Nadu: తమిళనాడులో 22 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఎల్టీటీఈ పునరుద్ధరణకు మాఫియా ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA searches across Tamil Nadu: తమిళనాడు వ్యాప్తంతా 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇటీవల శ్రీలంక నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై నమోదైన కేసుపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై. తిరుప్పూర్, చెంగల్పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లంక డ్రగ్ మాఫియా సంబంధాల గట్టును కనుక్కునేందుకు ఎన్ఐఏ ఈ రైడ్స్ నిర్వహించింది.
లంక డ్రగ్ మాఫియాను సి. గుణశేఖరన్ అలియాస్ గుణ, పుష్ఫరాజా అలియాస్ పూకుట్టి కన్న నిర్వహిస్తున్నారని.. వీరికి పాకిస్తాన్ లోని డ్రగ్స్, ఆయుధాల సరఫరాదారుడు హాజీ సలీంతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. డ్రగ్స్, ఆయుధాలను అక్రమం రవాణా చేస్తున్నవారు శ్రీలంక, ఇండియాలో ఎల్టీటీఈ సంస్థ పునరుద్దరణ కోసం పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. నిందితులపై ఐపీసీ, యూఏపీఏ, ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎన్ఐఏ పేర్కొంది. గురువారం ఎన్ఐఏ చేసిన రైడ్స్ లో డిజిటల్ పరికరాలు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది.
Also Read
Read Also: kaleshwaram project: కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేము.. తేల్చి చెప్పిన కేంద్రం
ఇదిలా ఉంటే బుధవారం ఎన్ఐఏ కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిమంది. శ్రీనగర్ తో పాటు పుల్వామాలో సోదాలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్ర కేసులో ఎన్ఐఏ ఈ సోదాలు చేసింది. జూలై 18న కాశ్మీర్ పోలీసులు నమోదు చేసిన ఓ కేసును ఎన్ఐఏ తిరిగి విచారిస్తోంది. ఎన్ఐఏ నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 15 పిస్టల్స్, 30 మ్యాగజైన్స్, 300 రౌండ్ల బుల్లెట్లను, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!