Khalistan: లండన్ భారత రాయబార కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతేడాది లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడికి తెగబడ్డారు. ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక నిందితుడు ఇంద్రపాల్ సింగ్ గబాను గురువారం అరెస్ట్ చేసింది. యూకే లోని హౌన్స్ నివాసి అయిని ఇంద్రపాల్ సింగ్ మార్చి 22, 2023 భారత రాయబార కార్యాలయం దాడిలో కీలకంగా వ్యవహరించాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఇతడు అరెస్ట్ చేయబడ్డాడు.
Read Also: Yadgiri: చపాతీ విషయంలో గొడవ.. ఒకరి హత్య..
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
గతేడాది మార్చి 18న ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్పాల్ సింగ్పై పంజాబ్ పోలీసులు చర్యలు తీసుకున్నందుకు ప్రతీకారంగా భారత హైకమిషన్పై దాడులు జరిగినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. మార్చి 19, మార్చి 22న లండన్లో భారతీయ మిషన్లు, దాని అధికారులపై దాడులకు తెగబడ్డారు. ఇది పెద్ద కుట్రలో భాగమని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
లండన్ భారత హైకమిషన్ ముందు నిరసన చేపట్టడమే కాకుండా మొదటి అంతస్తు బాల్కానీలోని భారత జాతీయ జెండాను తీసివేశారు. ఈ చర్య తర్వాత భారత రాయబార సిబ్బంది మరింత పెద్ద జెండాను అక్కడ ఉంచారు. భారత జెండాను అపవిత్రం చేయడాన్ని వ్యతిరేకిస్తూ UKలోని భారతీయ సమాజం ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లండన్ మేయర్, బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని యూకే సీనియర్ దౌత్యవేత్తను పిలిచి, రాయబార కార్యాలయంపై భద్రత లేకపోవడంపై వివరణ కోరింది. తమ రాయబార సిబ్బందిపై యూకే ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. లండన్ రాయబార కార్యాలయ దాడి కేసులో యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించింది.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..