Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అండ్ గ్యాంగ్పై రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి సమాచారం ఇస్తే రూ.25 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, పరారీలో ఉన్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అరెస్టుకు దారితీసే ఏదైనా సమాచారం ఇస్తే 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక, ఇబ్రహీం సన్నిహితుడు షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్పై రూ. 20 లక్షలు, సహచరులు హాజీ అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, ఇబ్రహీం రజ్జక్మోన్ తిజ్క్మోన్లకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు రివార్డును కూడా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
Read Also: GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఆగస్టులో రూ.1,43,612 కోట్లు..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
వీరంతా 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితులు.. వారి ఆచూకీ, అరెస్టు చేసేందుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్ఐఏ కోరిందని ఓ అధికారి తెలిపారు. ఆ సంస్థ ఫిబ్రవరిలో ‘డీ కంపెనీ’పై కేసు నమోదు చేసింది. మరోవైపు… దావూద్ ఇబ్రహీంను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించిందని, అతని సన్నిహితులైన అనీస్ ఇబ్రహీం షేక్, ఛోటా షకీల్, జావేద్ చిఖ్నా మరియు టైగర్ మెమన్లతో పాటు డీ-కంపెనీ అనే అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను నడుపుతున్నాడని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.
వారు ఆయుధాల స్మగ్లింగ్, టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, మనీలాండరింగ్, ఎఫ్ఐసీఎన్ యొక్క సర్క్యులేషన్, టెర్రర్ నిధులను సేకరించడం మరియు లష్కర్తో సహా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో క్రియాశీల సహకారంతో కీలక ఆస్తులను అనధికారికంగా స్వాధీనం చేసుకోవడం వంటి వివిధ ఉగ్రవాద-నేర కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొన్న ఎన్ఐఏ.. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు కీలక సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది.. కాగా, దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!