NewsClick: చైనాతో న్యూస్క్లిక్ న్యూస్ పోర్టల్కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు ఈ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్దరాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వీరికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మంగళవారం ఢిల్లీ పోలీసులు ఒకే సమయంలో న్యూస్క్లిక్ ఆఫీస్, ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 46 మందిని విచారించగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు సహా డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
Read Also: World Cup 2023: ఖలిస్తానీల బరితెగింపు.. ప్రపంచకప్ ముందు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. న్యూస్క్లిక్ మీడియాకు చైనాతో సంబంధాలున్నాయనే వార్తల్ని చూభామని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలపై ఇప్పుడేం స్పందించలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శక్తివంతమైన, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో మీడియా చేపడుతున్న బలమైన పాత్రకు తాము మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తో పాటు పలు దేశాల వద్ద ఇలాంటి అంశాలను అమెరికా ప్రస్తావించిందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించుకోవడం ఎంత అవసరమో గుర్తుంచుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
న్యూస్క్లిక్కి చైనా నుంచి వేల కోట్లు అందుతున్నాయంటూ.. ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ తో సమా అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమెరికన్ సిటిజన్, కోటీశ్వరడైన నెవెల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకర సాధనాలని పేర్కొంది. ఈ ఆరోపణలపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని జప్తు చేసింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!