NewsClick: చైనాతో న్యూస్క్లిక్ న్యూస్ పోర్టల్కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు ఈ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్దరాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వీరికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మంగళవారం ఢిల్లీ పోలీసులు ఒకే సమయంలో న్యూస్క్లిక్ ఆఫీస్, ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 46 మందిని విచారించగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు సహా డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
Read Also: World Cup 2023: ఖలిస్తానీల బరితెగింపు.. ప్రపంచకప్ ముందు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్..
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. న్యూస్క్లిక్ మీడియాకు చైనాతో సంబంధాలున్నాయనే వార్తల్ని చూభామని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలపై ఇప్పుడేం స్పందించలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శక్తివంతమైన, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో మీడియా చేపడుతున్న బలమైన పాత్రకు తాము మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తో పాటు పలు దేశాల వద్ద ఇలాంటి అంశాలను అమెరికా ప్రస్తావించిందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించుకోవడం ఎంత అవసరమో గుర్తుంచుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
న్యూస్క్లిక్కి చైనా నుంచి వేల కోట్లు అందుతున్నాయంటూ.. ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ తో సమా అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమెరికన్ సిటిజన్, కోటీశ్వరడైన నెవెల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకర సాధనాలని పేర్కొంది. ఈ ఆరోపణలపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని జప్తు చేసింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!