NewsClick: చైనాతో న్యూస్క్లిక్ న్యూస్ పోర్టల్కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు ఈ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్దరాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వీరికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మంగళవారం ఢిల్లీ పోలీసులు ఒకే సమయంలో న్యూస్క్లిక్ ఆఫీస్, ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 46 మందిని విచారించగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు సహా డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
Read Also: World Cup 2023: ఖలిస్తానీల బరితెగింపు.. ప్రపంచకప్ ముందు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. న్యూస్క్లిక్ మీడియాకు చైనాతో సంబంధాలున్నాయనే వార్తల్ని చూభామని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలపై ఇప్పుడేం స్పందించలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శక్తివంతమైన, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో మీడియా చేపడుతున్న బలమైన పాత్రకు తాము మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తో పాటు పలు దేశాల వద్ద ఇలాంటి అంశాలను అమెరికా ప్రస్తావించిందని, ఆన్లైన్, ఆఫ్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించుకోవడం ఎంత అవసరమో గుర్తుంచుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
న్యూస్క్లిక్కి చైనా నుంచి వేల కోట్లు అందుతున్నాయంటూ.. ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ తో సమా అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమెరికన్ సిటిజన్, కోటీశ్వరడైన నెవెల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకర సాధనాలని పేర్కొంది. ఈ ఆరోపణలపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని జప్తు చేసింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?