New Rules For International Passengers : అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక అది అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఎన్నో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. అయితే, మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితిలు వస్తుండడంతో.. క్రమంగా ఆ రూల్స్ను అన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి వివిధ దేశాలు.. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్ సువిధ పోర్టల్లో పూరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రాబోతున్నాయి.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్లో గణనీయమైన పురోగతి కొనసాగుతున్నందున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: MLAs poaching case: తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్.. కీలక నేతలకు నోటీసులు సిద్ధం చేసిన సిట్..
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
అంటే, సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది విమానయాన మంత్రిత్వ. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని క్లారిటీ ఇచ్చింది.. కాగా, విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క ఎయిర్ సువిధ పోర్టల్లోని ఫారమ్ ఇన్కమింగ్ అంతర్జాతీయ ప్రయాణీకులకు తప్పనిసరి. అందులో, ప్రయాణీకులు వారి టీకా స్థితిని, స్వీకరించిన మోతాదుల సంఖ్య మరియు వాటి తేదీలతో సహా ప్రకటించాల్సి ఉండేది.. ఇది చాలా దేశాల్లోని నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే, ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు.. మాస్క్ల వాడకం మరియు విమానాశ్రయాలలో భౌతిక దూరం పాటించడం.. ఇలా అనేక రూల్స్ ఉండేవి.. కానీ, గత వారం, విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణంలో ఇకపై మాస్క్ల వాడకం తప్పనిసరి కాదని, అయితే, కరోనావైరస్ యొక్క మరొక ఉప్పెనను నివారించడానికి ప్రయాణికులు వాటిని ఉపయోగించాలని పేర్కొన్న విషయం విదితమే.. ఇక, ఇప్పుడు ఎయిర్ సువిధ పోర్టల్లో అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్ సువిధ పోర్టల్లో పూరించాల్సిన అవసరం లేదని మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..