Mamata Benerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిని బీజేపీ, ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల తరహాలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని అధికార కూడా త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అందుకే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజలు ఉండదని తెలిపారు. ఇండియా టుడే కన్క్లేవ్ ఈస్ట్ 2022 కార్యక్రమంలో ఆమె సోమవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సర్కారు కొనసాగుతుందని తాను భావించడం లేదని.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు కానీ ప్రజల హృదయాలను గెలవలేరని ఆమె వెల్లడించారు.
Maharashtra: మహారాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూల్చవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాల్లో మిమ్నల్లి కూల్చేస్తారని అని మమతా బెనర్జీ అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బుతో పాటు చాలా ఇచ్చిందని ఆరోపించారు. షిండే ప్రభుత్వం కూలిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. భాజపా తరచూ ఖండిస్తూ వస్తున్న వారసత్వ రాజకీయాలపైనా మమత బెనర్జీ స్పందించారు. భాజపా దేన్ని వారసత్వ రాజకీయం అంటోంది? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ మరణం తర్వాత ఆయన కుమార్తె షేక్ హసీనా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె కాకుండా ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు? అంటూ ఆమె ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న బీజేపీ.. మరెందుకు హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఈ వారసత్వ పదవి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!