Maharashtra: మహారాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సర్కారు ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను త్వరలో తగ్గిస్తామని సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వ్యాట్ తగ్గింపుపై రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్టు షిండే చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.28గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్లో కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాయి.
ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే ఇవాళ శానససభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. ఉదయం జరిగిన బలనిరూపణ పరీక్షలో 164 మంది శాసనసభ్యుల మద్దతుతో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీలో ప్రసంగించిన ఏక్నాథ్ షిండే.. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
Devendra Fadnavis: అవును మాదీ ఈడీ ప్రభుత్వమే.. ‘ఏక్నాథ్-దేవేంద్ర’ సర్కార్..
వాస్తవానికి ఇంధనంపై అటు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా, రాష్ట్రాలు కూడా వ్యాట్ను వసూలు చేస్తున్నాయి. ఇటీవల పలు కారణాలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ఈ క్రమంలో తాము కొంత మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని చెప్పిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ దిశగా షిండే కీలక ప్రకటన చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!