Farmers Protest: “మోడీ గ్రాఫ్ని తగ్గించాల్సిన అవసరం ఉంది”.. రైతు నేత వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో సహా 12 కీలక డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో దేశ రాజధానిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయత్నాలను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల్ని, నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలను ఉంచి రైతులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసిన ఫరూక్ అబ్దుల్లా..
Also Read
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ఇదిలా ఉంటే, రైతు సంఘం నేత ప్రధాని మోడీని ఉద్దేశించి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. రైతు నాయకుడు దల్లేవాల్ మాట్లాడుతూ..‘‘ మోడీ పాపులారిటీ ఇప్పుడు పీక్స్లో ఉంది, రామ మందిరం వల్ల ఆయన గ్రాఫ్ పెరిగింది. ఈ గ్రాఫ్ తగ్గించాల్సిన సమయం వచ్చింది’’ అని 2024 లోక్సభ ఎన్నిలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు సరికాదని, కానీ వారికి ఎక్కడి నుంచో మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోందని, పంజాబ్ ప్రభుత్వం వారిని అడ్డుకోగలదు, కానీ వారు అలా చేయలేదని, మరోవైపు రైతు ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రైతు నేత చేసింది రాజకీయ ప్రకటన అని, ఇలా చేస్తే ప్రజలు మోడీకి మద్దతు ఇవ్వకుండా మానేస్తారా.? అని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు ఇది సరైన మార్గం కాదని అన్నారు. వారు ఢిల్లీకి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రైళ్లు, బస్సులు, సొంత వాహనాలు ఉండగా.. ట్రాక్టర్ల ద్వారా వెళ్లడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. జగ్జీత్ సింగ్ దల్లేవాల్ భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్)కు నాయకత్వం వహిస్తున్నారు.
“Modi Popularity graph is very High.
Only few days left for elections.
We have to bring that graph down.”-Farmer leader Jagjit Singh Dallewal pic.twitter.com/SzTVSQL3ff
— Rishi Bagree (@rishibagree) February 15, 2024
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!