PM Modi: మోదీకి అనుకూలంగా 80 శాతం భారతీయులు.. ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన స సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీకి సుమారుగా 80 శాతం మంది భారతీయులు ఉన్నారని, ఇందులో చాలా మంది మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచస్థాయిలో భారత పలుకుబడి పెరిగిందని భావిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది.
ఈ సర్వే ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్య జరిగింది. 30,800 మంది అభిప్రాయాలను, 23 దేశాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను వెల్లడించింది. మొత్తంగా భారతీయులు (79 శాతం) మంది అనుకూలంగా అభిప్రాయాలను కలిగి ఉండగా.. 55 మంది మోడీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు తేలింది. 2024 ఎన్నికల్లో మూడోసారి మోడీనే ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కేవలం 5 శాతం మంది మాత్రమే మోడీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ప్రపంచంలో పలుకుబడి:
ప్యూ సర్వే సర్వే ప్రకారం 68 శాతం ఇండియన్స్ ప్రపంచంలో భారతదేశ ప్రభావం పెరిగిందని భావిస్తున్నారు. 19 శాతం తగ్గిందని భావిస్తున్నారు. జీ20లోని మెజారిటీ దేశాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. అయితే గత 15 ఏళ్లతో పోలిస్తే యూరపియన్ దేశాల సానుకూల సెంటిమెంట్ భారత్ పై తగ్గిందని తెలిపింది. ప్యూ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల సానుకూలతను 46 శాతం మంది మధ్యస్తంగా వ్యక్తం చేశారు. 34 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారు.
12 దేశాలకు చెందిన వారిని ఇంటర్నేషనల్ వ్యవహారాలపై ప్రధాన మంత్రి మోడీ సామర్థ్యంపై ప్రశ్నించగా.. 40 శాతం మంది విశ్వాసం లేదని, 37 శాతం మంది విశ్వాసం ఉందని చెప్పారు.
ఈ సర్వేలో చైనా, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా వంటి జీ20 దేశాలను చేర్చకపోవడం గమనార్హం. చాలా యూరోపియన్ దేశాల్లో ప్రజాదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్లో, భారతదేశం యొక్క అనుకూలమైన రేటింగ్ 15 సంవత్సరాల క్రితం 70% నుండి 2023 నాటికి కేవలం 39%కి పడిపోయింది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ 71 శాతం భారత్ కు అనుకూలంగా ఉంది.
ఆదే విధంగా 41 శాతం మంది భారతీయులు రష్యా ప్రభావం పెరుగుతుందని చెబితే.. 21 శాతం మంది తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. 50 శాతం కన్నా ఎక్కువ భారతీయులు ఇటీవల కాలంలో అమెరికా ప్రభావం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే చెప్పింది. చైనాపై 67 శాతం మంది ఇండియన్స్ ప్రతికూలంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!