PM Modi: మోదీకి అనుకూలంగా 80 శాతం భారతీయులు.. ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన స సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీకి సుమారుగా 80 శాతం మంది భారతీయులు ఉన్నారని, ఇందులో చాలా మంది మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచస్థాయిలో భారత పలుకుబడి పెరిగిందని భావిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది.
ఈ సర్వే ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్య జరిగింది. 30,800 మంది అభిప్రాయాలను, 23 దేశాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను వెల్లడించింది. మొత్తంగా భారతీయులు (79 శాతం) మంది అనుకూలంగా అభిప్రాయాలను కలిగి ఉండగా.. 55 మంది మోడీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు తేలింది. 2024 ఎన్నికల్లో మూడోసారి మోడీనే ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కేవలం 5 శాతం మంది మాత్రమే మోడీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ప్రపంచంలో పలుకుబడి:
ప్యూ సర్వే సర్వే ప్రకారం 68 శాతం ఇండియన్స్ ప్రపంచంలో భారతదేశ ప్రభావం పెరిగిందని భావిస్తున్నారు. 19 శాతం తగ్గిందని భావిస్తున్నారు. జీ20లోని మెజారిటీ దేశాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. అయితే గత 15 ఏళ్లతో పోలిస్తే యూరపియన్ దేశాల సానుకూల సెంటిమెంట్ భారత్ పై తగ్గిందని తెలిపింది. ప్యూ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల సానుకూలతను 46 శాతం మంది మధ్యస్తంగా వ్యక్తం చేశారు. 34 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారు.
12 దేశాలకు చెందిన వారిని ఇంటర్నేషనల్ వ్యవహారాలపై ప్రధాన మంత్రి మోడీ సామర్థ్యంపై ప్రశ్నించగా.. 40 శాతం మంది విశ్వాసం లేదని, 37 శాతం మంది విశ్వాసం ఉందని చెప్పారు.
ఈ సర్వేలో చైనా, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా వంటి జీ20 దేశాలను చేర్చకపోవడం గమనార్హం. చాలా యూరోపియన్ దేశాల్లో ప్రజాదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్లో, భారతదేశం యొక్క అనుకూలమైన రేటింగ్ 15 సంవత్సరాల క్రితం 70% నుండి 2023 నాటికి కేవలం 39%కి పడిపోయింది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ 71 శాతం భారత్ కు అనుకూలంగా ఉంది.
ఆదే విధంగా 41 శాతం మంది భారతీయులు రష్యా ప్రభావం పెరుగుతుందని చెబితే.. 21 శాతం మంది తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. 50 శాతం కన్నా ఎక్కువ భారతీయులు ఇటీవల కాలంలో అమెరికా ప్రభావం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే చెప్పింది. చైనాపై 67 శాతం మంది ఇండియన్స్ ప్రతికూలంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!