Bhagavad Gita: లక్ష మంది భగవద్గీత పఠనం.. బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపుగా 1,20,000 మంది ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కోల్కతాలో జరిగిన ‘లోఖే కొంతే గీతాపథం’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. భగవద్గీత ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక అని, ఈ కార్యక్రమాన్ని హేళన చేసిన వారికి హిందూ ధర్మ, సంప్రదాయాల పట్ల గౌరవం లేదని, హిందువులను విభజించడంలో విఫలం అవుతున్నారంటూ.. పరోక్షంగా టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం రాష్ట్రంలో హిందువులను ఐక్యం చేస్తుందని, భగవద్గీత పఠించడమే కాకుండా, హిందువులను ఐక్యం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. గీతా పారాయణంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని, మతాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటే అని దుయ్యబట్టారు. టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా మాట్లాడుతూ.. గీతాపారయణ కార్యక్రమం బదులుగా ఫుట్బాల్ మ్యాచ్ని నిర్వహించొచ్చని, బెంగాల్ ప్రజలు ఇలాంటి వాటిని పట్టించుకోరని అన్నారు.
తాజావార్తలు
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!