Seema Haider: భారత్-పాకిస్తాన్ “సరిహద్దు”పై ప్రశ్న..స్టూడెంట్ ఏం రాశాడో తెలుసా..? చూస్తే నవ్వు ఆపుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seema Haider: భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి పరీక్షలో ప్రశ్న అడగడం, దీనికి ఓ విద్యార్థి రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా ఇంటర్నెట్ని ఆకట్టుకుంటుంది ఈ సమాధానం.
విషయానికి వస్తే.. పరీక్షలో ‘‘ భారత్- పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై, లంబే బతావో..?(భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏ సరిహద్దు ఉంది, దాని పొడవు చెప్పండి?)’’ అనే ప్రశ్న వచ్చింది. దీనికి సదరు విద్యార్థి ఏకంగా ‘సీమ’(సరిహద్దు)ని ‘‘సీమా హైదర్’’గా పొరబడ్డాడు. ఇటీవల సీమా హైదర్ అనే యువతి తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్కి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..

Read Also: BJP: “అయోధ్య రాముడి” నినాదంతో లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..
స్టూడెంట్ భారత్-పాకిస్తాన్ మధ్య సీమ(సరిహద్దు) సీమా హైదర్ అని, ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలను రెండు దేశాల మధ్య దూరంగా రాశాడు. దీంతో ఒక్కసారిగా ఈ సమాధానం వైరల్ అవుతోంది. ఈ సమాధానం చూసి పడిపడి నవ్వుకుంటున్నారు. ”దోనో దేశోం కే బీచ్ సీమా హైదర్ హై. ఉస్కీ లంబై 5 అడుగుల 6 అంగుళాల హై. దోనో దేశోం కే బీచ్ ఇస్కో లేకర్ లడాయి హై (సీమా హైదర్ రెండు దేశాల మధ్య ఉంది. ఆమె 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు. ఆమె కారణంగా దేశాలు పోరాడుతున్నాయి)’’ అని సమాధానం రాశాడు.
దీనిపై నెటిజన్లు ఫన్నీగా రిఫ్లై ఇస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు కామెంట్ చేయగా.. ఇంకొకరు ‘ అతను రాసిన వినూత్న సమాధానికి అదనపు మార్కులు ఇవ్వాలి’ అని, మరొకరు ‘ విద్యార్థి ఇరు దేశాల మధ్య అంతరాన్ని తగ్గించాడు, అతన్ని సస్పెండ్ చేయరని ఆశిస్తున్నా’ అంటూ రిఫ్లై ఇచ్చారు.
ఈ ఏడాది పాకిస్తాన్కి చెందిన సీమా హైదర్ అనే యువతి భారత్ లోని సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్ వచ్చింది. పబ్జీ గేమ్తో ఇద్దరు కలిశారు. 2019లో వీరి పరిచయం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది తన నలుగురి పిల్లలతో నేపాల్ ద్వారా ఇండియాలోకి వచ్చింది. ప్రస్తుతం సీమా హైదర్, సచిన్ మీనా సహజీవనం చేస్తున్నారు.
Question – Bharat aur Pakistan ke bich kaun si seema hai, lambai batao?
Answer – Dono desho ke bich Seema Haider hai, uski lambai 5 ft 6 inch hai, dono desho ke bich isko lekar ladai hai. pic.twitter.com/25d5AvUlwl
— Narundar (@NarundarM) December 21, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!