NCERT UEducate deal: యూఎడ్యుకేట్తో NCERT కీలక ఒప్పందం.. దాదాపు 2.5 కోట్ల విద్యార్థులకు యూజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT UEducate deal: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (NCERT) – యూఎడ్యుకేట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందంపై సంతకం చేసింది. ఈసందర్భంగా NCERT అధికారులు మాట్లాడుతూ.. భారతదేశ విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. యూఎడ్యుకేట్ సహకారంతో ఎన్సీఈఆర్టీ తన మొత్తం పాఠ్యాంశాల్ని KATBOOK అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఫార్మాట్లోకి మార్చనుందన్నారు. ఈ ఫార్మాట్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశం వీడియోలు, యానిమేషన్లు, 3డీ మోడల్స్, సిమ్యులేషన్ల వంటి వివిధ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులకు క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకొనేలా ఈ పాఠాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
READ MORE: Real Estate: హైదరాబాద్లో మళ్లీ పుంజుకున్న భూముల ధరలు
Also Read
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
యూఎడ్యుకేట్ గ్లోబల్ వ్యవస్థాపకుడు, ఎండీ శరత్ కాకుమాను మాట్లాడుతూ.. ఈ ఒప్పందం భారతీయ విద్యను మార్చే ప్రయాణంలో కీలక ముందడుగు అన్నారు. విద్యను మరింత సరదాగా, అందరికీ చేరేలా అన్ని భాషల్లో అందేలా చేస్తామన్నారు. KATBOOK ద్వారా తాము టీచర్లు, విద్యార్థులకు బోధనలో సహకారం అందిస్తామన్నారు. ప్రతి పిల్లవాడికీ నాణ్యమైన విద్య అందించాలనే తమ సంకల్పం ఈ ఒప్పందం ద్వారా నెరవేరబోతోందన్నారు. ఈ ఒప్పంద పత్రాలపై ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్సీఈఆర్టీ కార్యదర్శి అమన్ శర్మ, యూఎడ్యుకేట్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డైరెక్టర్ మన్రైత్ చద్దా సంతకాలు చేశారు. జాతీయ విద్యా విధానం 2020, డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యాలకనుగుణంగా విద్యారంగంలో జరిగే ఉన్నత ప్రయోగాల్లో ఈ ప్రాజెక్టు ఒకటిగా నిలుస్తుందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.
KATBOOK డిజిటల్ పుస్తకాలు..
ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో దాదాపు 2.5 కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అంచనా. KATBOOK డిజిటల్ పుస్తకాల్లో ఏఐ ఆధారిత క్లాస్రూమ్ టూల్స్, డిక్షనరీలు, ఆడియో బుక్స్, అనువాదాలు వంటి సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థులు నేర్చుకొనే విధానాన్ని ఉపాధ్యాయులే ప్రత్యక్షంగా పర్యవేక్షించి.. వారు ఎదుర్కొనే ఇబ్బందులను గమనించి మరింత మెరుగైన బోధనా పద్ధతులను అనుసరించివచ్చు. ఇవి ఆఫ్లైన్లో ఉపయోగించుకొనే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకూ దీంతో ప్రయోజనం కలగనుంది. దీన్ని తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రోగ్రామ్గా అమలు చేసి ఆ తర్వాత వచ్చే 18 నెలల్లో దేశ వ్యాప్తంగా విస్తరించనున్నారు.
READ MORE: Agni 5 missile test: విజయవంతమైన అగ్ని 5.. ఇక శత్రు దేశాలకు వణుకే..
తాజావార్తలు
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
-
Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
-
Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!