Navy Dareness: నౌకా దళం సాహసం.. కాపాడబడిన రెండున్నరేళ్ల బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Dareness: నౌకా దళం రాత్రిపూట సాహసం చేయడంతో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు రక్షించబడ్డాడు. రాత్రి వేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి చిన్నారి బాలుడు ప్రాణాలు కాపాడటంలో తమ సహకారం అందించారు. తీవ్ర శ్వాసకోస అనారోగ్యానికి గురైన ఓ చిన్నారి ప్రాణాలను నిలపడానికి భారత నౌకా దళం గొప్ప సాహసమే చేసింది. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రివేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి సకాలంలో చిన్నారిని ఆస్పత్రికి చేర్చింది. సకాలంలో చిన్నారిని ఆసుప్రతికి తీసుకురావడంతో వైద్యులు చికిత్సను అందించి రెండున్నరేళ్ల బాలుడిని రక్షించారు.
Read also: Vivo Y36: మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ఫీచర్స్, ధర?
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
లక్షదీవుల్లోని అగత్తి దీవిలో ఓ రెండున్నరేళ్ల బాలుడు తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ఆస్పిరేషన్ న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యంతో పోరాడుతున్న ఆ బాలుడికి తక్షణ వైద్య సహాయం అవసరమైంది. అయితే అది మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఆందోళన చెందిన బాలుడి కుటుంబం.. లక్షదీవుల అధికార యంత్రాంగానికి తమ కుమారుడి పరిస్థితి వివరించింది. స్పందించిన అధికారులు ఆ చిన్నారి ప్రాణాలు నిలపాలంటే తక్షణమే కోచికి తరలించాలని భావించింది. ఈ విషయంలో భారత నౌకా దళం సాయం కోరింది. వెంటనే రంగంలోకి దిగిన నౌకా దళం డోర్నియర్ విమానం ద్వారా ఆ చిన్నారిని కేరళలోని కొచ్చిన్కు తరలించింది. అప్పటికి అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉన్నా లేక్కచేయలేదు. అగత్తి వైమానిక కేంద్రం నుంచి హుటాహుటిన విమానంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు.
Read also: Ashada Masam 2023: ఆషాడ మాసం.. కొత్త జంటలు, అత్తాకోడళ్లు అస్సలు కలవకూడదు ఎందుకు?
రాత్రివేళ విమానాల రాకపోకలకు అనుమతించే చర్యల వల్ల ఇది సాధ్యమైందని నౌకాదళం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ బాలుడు ప్రస్తుతం కోచిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపింది. అగత్తిలో వైమానిక కేంద్రాన్ని 1988లో ప్రారంభించి.. డోర్నియర్-228 విమానాలను నడుపుతున్నారు. తర్వాత 2010లో ఏటీఆర్-72 యుద్ధ విమానాలను నడిపేందుకు వీలుగా దీనిని విస్తరించారు. అయితే, గతేడాది అక్టోబరులో మొదటిసారిగా డోర్నియర్-228 విమానాలను రాత్రిపూట ల్యాండింగ్ చేయడం ప్రారంభించారు. దీంతో లక్షదీవుల సమీపంలో భారత నౌకాదళం 24 గంటల నిఘా సామర్ధ్యం రెట్టింపయ్యింది. అయితే, తక్కువ పొడవున్న రన్వే, పరిమిత ఎయిర్ఫీల్డ్ సేవలు అందుబాటులో ఉండటంతో పౌర, సైనిక విమానాలు రెండూ పగటిపూట మాత్రమే నడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!