Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News National Herald Case Ed Seals Young Indians Office

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం..యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్ చేసిన ఈడీ

Published Date :August 3, 2022 , 7:44 pm
By Venu Goapl Reddy
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం..యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్ చేసిన ఈడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

National herald case – ED seals Young Indian’s office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.  హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది. గత రెండు రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు చేస్తోంది ఈడీ. తాజాగా యంగ్ ఇండియా కార్యలయాన్ని సీజ్ చేసింది.  ఈడీ ముందస్తు అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రదేశాన్ని తెరవకూడదంటూ.. ఈడీ హెచ్చరించింది.  సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా ఇలా చేసినట్లు ఈడీ తెలిపింది. అయితే నేషనల్ హెరాల్డ్ సీనియర్ అధికారులు తమకు సహకరించడం లేదని.. దీంతో సీజ్ చేయడం తప్పితే వేరే మార్గం లేదని ఈడీ అధికారులు తెలుపుతున్నారు. “యంగ్ ఇండియా లిమిటెడ్” సంస్థకు ప్రిన్సిపల్ ఆఫీసర్ గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఆక్కడి నుండి వెళ్ళిపోయారని.. సోదాల నిర్వహణకు ఖర్గేకు సమన్లు పంపించామని ఈడీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని పలుమార్లు విచారించింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాల మధ్య అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ నేతలను ఈడీ వరసగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ బన్సల్ ను విచారించింది ఈడీ. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏఐసీసీ  ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి కాంగ్రెస్ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంతో పాటు.. 10 జన్ పథ్ కార్యాలయం వెలుపల భారీగా పోలీసులు మోహరించారు.

Read Also: Commonwealth Games: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం

ఇదిలా ఉంటే ఈడీ చర్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  నేషనల్ హెరాల్డ్ హౌజ్ పై దాడిని కాంగ్రెస్ పార్టీపై చేసిన దాడిగా జైరాం రమేష్ అభివర్ణించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని.. దీన్ని ఖండిస్తున్నామని.. మీరు మమ్మల్ని నిశబ్ధంగా ఉంచలేదని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.  ఏఐసీసీని పోలీస్ కంటోన్మెంట్ గా మార్చారని.. ప్రభుత్వం మమ్మల్ని కావాల్సినంతగా అణచివేయవచ్చని.. కానీ మేము ద్రవ్యోల్భనం, నిరుద్యోగం, జీఎస్టీపై నిరసన తెలుపుతామని.. జైలు శిక్షవిధించినా ముందుకే వెళ్తాం అని అజయ్ మాకెన్ అన్నారు. 10 జన్ పథ్, కాంగ్రెస్ కార్యాలయాన్ని పోలీస్ కంటోన్మెంట్ గా మార్చి  అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని.. యంగ్ ఇండియా కార్యాలయాన్ని బలవంతంగా సీజ్ చేశారని.. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి కాంగ్రెస్ పోరాడుతుందని..  రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • ED seals Young Indian's office
  • Enforcement Directorate
  • National Herald case
  • sonia gandhi

తాజావార్తలు

  • Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

  • MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions