Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోతలో 67 మంది నిర్దోషులే అని ప్రకటించిన కోర్టు.. అసదుద్దీన్ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు చెప్పిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ.. అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
‘‘మీరు ఎక్కడికెళ్లినా పొగపెడతారు, గందరగోళాన్ని సృష్టిస్తారు. సారవంతమైన నేలలో రక్తం చిందించే హక్కు రాజకీయాలు మీకు కల్పించాయి, మీరే అప్పీలు చేస్తారు, మీరే కేసు వాదిస్తారు, మీరే సాక్షి, మీరే న్యాయవాది. మీరు ఎవరినైనా దూషించే స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా చంపడానికి స్వేచ్ఛ ఉంది’’ అని గురువారం రాత్రి అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఈ కేసులో మొత్తం 67 మంది నిందితులుగా ఉంటే కేసు విచారణ సమయంలో 18 మంది మరణించారు.
Also Read
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
Read Also: Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
నరోదా పాటియా కేసు ఏంటి..?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 28,2002 గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పటించిన ఘటనలో 58 మంది కరసేవకులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత నరోదా గామ్ సంఘటన జరిగింది. అహ్మదాబాద్ లోని నరోదాగామ్ లో దాదాపు 11 మంది ముస్లిం గుంపు హత్యకు గుర్యయ్యారు. 2008లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) 86 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి శుభదా బాక్సీ గురువారం తీర్పు చెప్పారు. నిర్దోషులు బంధువులు తీర్పును స్వాగతించించారు. జైశ్రీరాం, భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ముస్లింలు ఈ తీర్పును ఖండించారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!