Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోతలో 67 మంది నిర్దోషులే అని ప్రకటించిన కోర్టు.. అసదుద్దీన్ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిందితులంతా నిర్దోషులే అని కీలక తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం ఈ తీర్పును ప్రకటించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, మాజీ భజరంగ్ దళ్ నాయకుడు బాబు బజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు చెప్పిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ.. అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు.
‘‘మీరు ఎక్కడికెళ్లినా పొగపెడతారు, గందరగోళాన్ని సృష్టిస్తారు. సారవంతమైన నేలలో రక్తం చిందించే హక్కు రాజకీయాలు మీకు కల్పించాయి, మీరే అప్పీలు చేస్తారు, మీరే కేసు వాదిస్తారు, మీరే సాక్షి, మీరే న్యాయవాది. మీరు ఎవరినైనా దూషించే స్వేచ్ఛ ఉంది, ఎవరినైనా చంపడానికి స్వేచ్ఛ ఉంది’’ అని గురువారం రాత్రి అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఈ కేసులో మొత్తం 67 మంది నిందితులుగా ఉంటే కేసు విచారణ సమయంలో 18 మంది మరణించారు.
Also Read
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
Read Also: Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
నరోదా పాటియా కేసు ఏంటి..?
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 28,2002 గోద్రాలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు నిప్పటించిన ఘటనలో 58 మంది కరసేవకులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత నరోదా గామ్ సంఘటన జరిగింది. అహ్మదాబాద్ లోని నరోదాగామ్ లో దాదాపు 11 మంది ముస్లిం గుంపు హత్యకు గుర్యయ్యారు. 2008లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్ ) 86 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి శుభదా బాక్సీ గురువారం తీర్పు చెప్పారు. నిర్దోషులు బంధువులు తీర్పును స్వాగతించించారు. జైశ్రీరాం, భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ముస్లింలు ఈ తీర్పును ఖండించారు.
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!