Congress Leader: షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి కూడా.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏదో రోజు పీఎం ఇంటిని ఆక్రమిస్తామన్న సజ్జన్ వర్మ.. సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader: బంగ్లాదేశ్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు భారత్లో కూడా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశంలో హింసను రాజేయడం కాంగ్రెస్ ఉద్దేశమా..? అని కమలం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన కొన్ని గంటల తర్వాత కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
Read Also: MP Fraud: సరికొత్త మోసం.. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో పెట్టి నగదు కాజేసిన కేటుగాళ్లు
ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసి)లో జరిగిన కుంభకోణాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ, పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో షేక్ హసీనా పాలనకి వ్యతిరేకంగా పౌర అశాంతి సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించారని టీవీ ఛానెల్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ‘‘నరేంద్ర మోదీ జీ, మీ తప్పుడు విధానాల వల్ల ఏదో ఒక రోజు ప్రజలు ప్రధాని నివాసంలోకి ప్రవేశించి (పీఎం హౌస్ని) ఆక్రమించుకుంటారు, ఇది ఇటీవల శ్రీలంకలో (2022లో) జరిగింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ జరిగింది. రేపు భారత్ వంతు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ యువమోర్చా కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. 140 కోట్ల భారతీయులు మనోభావాలను వర్మ దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ రామ్ సనేహి మిశ్రా తెలిపారు.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!