Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు.
దీంతో ఈ కేసులో దోషులుగా ఉన్న నళిని, రవిచంద్రన్ కూడా తమకు ఉపశమనం కలిగించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చిందని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన ఏజీ పేరారివాలన్ను విడుదల చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మే 18న సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాలను కల్పించింది. పెరారివాలన్ విడుదలైన తర్వాత, రవిచంద్రన్, అతనితో సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కు లేఖ పంపారు. గవర్నర్ విడుదల ఫైళ్లను మూడేళ్లుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంచారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. సెప్టెంబరు 2018లో తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ఆధారంగా జైలు నుండి ముందస్తు విడుదల కోసం పెరారివాలన్ చేసిన అభ్యర్థనను నిర్ణయిస్తూ, అత్యున్నత న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది, మరో ఆరుగురు దోషులు జైలులోనే ఉన్నారు. హైకోర్టు ఆదేశంపై రవిచంద్రన్ తన అప్పీల్లో పెరారివాలన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉదహరించారు. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళా మానవబాంబుగా మారడంతో రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!