Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఉచిత హామీలు, పథకాలపై బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కార్పొరేట్ సంపన్నుల రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. బియ్యం, గోధుమలు కొనుగోలు చేసే నిరుపేద కూడా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. 2014లో కేంద్ర బడ్జెట్ రూ 20 లక్షల కోట్లు.. అది ఇప్పుడు రూ.40లక్షల కోట్లకు చేరిందని.. అందులో రూ.10లక్షల కోట్లు సంపన్నుల రుణమాఫీ చేయడానికే కేంద్రం ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. పెద్దపెద్ద కంపెనీలకు కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేసిందన్న కేజ్రీవాల్ .. అలాంటి రుణాలను మాఫీ చేయకుంటే పేద ప్రజల అన్నంపై పన్నులు విధించే పరిస్థితి వచ్చేదే కాదని కేంద్రంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. అలా అత్యంత పేదలపైనా పన్నుల భారం మోపుతోందంటే కేంద్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Venkaiah Naidu : అయితే ప్రెసిడెంట్, లేదా డిసిడెంట్.. ఇది నా నైజం కాదు
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గింపు, ఆహారోత్పత్తులపై జీఎస్టీ, జాతీయ ఉపాధి హామీ పధకంలో 25 శాతం కోత విధించడం ద్వారా సమకూరిన నిధులు ఏమవుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని.. మరోవైపు సైనికులకు పింఛన్లు చెల్లించేందుకు కూడా నిధుల లేమిని సాకుగా చూపుతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. తమ అగ్నిపథ్ యోజనను సమర్థిస్తూ, రక్షణ సిబ్బందికి ఇకపై పింఛన్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే వాటిలో కొంత మాత్రమే రాష్ట్రాలకు ఇస్తుందని కేజ్రీవాల్ వెల్లడించారు. అంతకుముందు రాష్ట్రాలకు 42శాతం ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు అది దాదాపు 29 నుంచి 30శాతానికి పడిపోయిందన్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు రెండు, మూడు రెట్లు అదనంగా పన్నులను కేంద్రం వసూలు చేస్తోందని… ఆ డబ్బంతా ఎక్కడికి పోతోందని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..