Bihar: ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- శ్రావణమాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరాకటంలో పడేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా మటన్ పాలిటిక్స్ రాష్ట్రంలో హీటెక్కిస్తోంది.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ప్రస్తుతం దేశంలో శ్రావణమాసం నడుస్తోంది. అయితే శ్రావణమాసంలో హిందువులు నాన్వెజ్ తినరు. కానీ సోమవారం ఎన్డీఏ సమావేశంలో నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. పాట్నాలోని అసెంబ్లీలో జరిగిన విందు వంటకాల్లో మటన్ లేబుల్ కనిపించింది. దీంతో శ్రావణమాసంలో మటన్ ఆరగించడమేంటి? అని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులను విమర్శిస్తారు కానీ.. తమ విషయంలో మాత్రం సనాతన ధర్మం పాటించారా? అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
మటన్ తిన్నవారిలో మోడీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని.. శ్రావణమాసంలో రోజుకు 3 కిలోల మటన్ తింటారని.. కానీ ఇతరులకు సనాతన ధర్మం గురించి బోధిస్తారంటూ ఎద్దేవా చేశారు. తినే ఆహారంపై తమకు అభ్యంతరం లేదు గానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శిస్తారంటూ ధ్వజమెత్తారు.
2023 శ్రావణ మాసంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ భోజనం ఆతిథ్యం ఇచ్చారు. ఆనాటి దృశ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!