Non-veg Food At Temple: ఆలయంలో మాంసాహార తీసుకున్నాడని ఆరోపించారు అన్నామలై.. ఖండించిన ముస్లిం లీగ్ ఎంపీ!
- హిందూ ఆలయంలో ముస్లిం లీగ్ ఎంపీ బిర్యానీ తిన్నాడని బీజేపీ ఆరోపణలు..
- మురుగన్ ఆలయ కొండపై నేను నాన్-వెజ్ తినలేదని ప్రకటించిన ముస్లిం లీగ్ ఎంపీ కానీ..
- అన్నామలై ఆరోపణలు నిరూపిస్తే ఎంపీ పదవికీ రాజీనామా చేస్తా: ఎంపీ నవాస్ కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయ కొండపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కానీ మాంసాహారం తిన్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. దీనిపై రామనాథపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేసిన అభియోగాలను నిరూపించలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. నేను ఇప్పటి వరకు తిరుపరంకుండ్రం ఆలయ కొండపైకి వెళ్లలేదు లేదని ఎంపీ నవాస్ పేర్కొన్నారు.
Read Also: Donald Trump: ఉత్తర కొరియా అధ్యక్షుడితో త్వరలో భేటీ అవుతా
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ఇక, కావాలనే తనపై బీజేపీ నేతలు అన్నామలై, ఎల్ మురుగన్, వానతి శ్రీనివాసన్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని IUML ఎంపీ నవాస్ కానీ పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య విభజనను సృష్టించడానికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య మతపరమైన అశాంతిని కలిగించే చర్యగా IUML ఎంపీ అభివర్ణించారు. అలాగే, తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్న రామనాథపురం ఎంపీ కానీ, వక్ఫ్ బోర్డు చుట్టూ ఉన్న భూ వివాదాలపై కూడా మాట్లాడారు.. యాభై శాతం భూమి సికందర్ బాదుషా దర్గా వక్ఫ్ బోర్డుకు చెందినది.. అది ప్రభుత్వ గెజిట్లో ప్రచురించబడిందన్నారు.
Read Also: Minister Kishan Reddy: విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం
అయితే, తిరుపరంకుండ్రంలోని కొండపైకి జంతువుల రవాణాను పోలీసులు తాత్కాలికంగా నిలిపి వేశారు. దీంతో ప్రజలకు, పోలీసులకు మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ కొండపై ఇంతకుముందు జంతుబలి ప్రబలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది అని రామనాథపురం ఎంపీ నవాస్ కానీ చెప్పుకొచ్చారు. ఇక, పోలీసులు నిలిపి వేసిన ప్రదేశానికి వెళ్లి నేను ఎలా బిర్యానీ తిన్నాను అని ఆరోపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!