Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు
- మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- గవర్నర్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సమర్పించిన క్షమాపణను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిర్ణయించే ముందు.. మంత్రిపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూడాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అనుచిత వ్యాఖ్యలు
గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను “ఉగ్రవాదుల సోదరి”గా అభివర్ణించారు. ఉగ్రవాదుల మతానికి చెందిన ఆమెనే.. శత్రువులపైకి మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేపట్టే అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సోమవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. మంత్రిపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు గతంలోనే కోరింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
మరోవైపు విజయ్ షా తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదిస్తూ.. మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించారు.
SIT దర్యాప్తు పూర్తి
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిందని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. గవర్నర్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఏమిటనే దానిపై కూడా ఆయన స్పష్టత కోరారు. ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇస్తే ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అనుమతి లభిస్తే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఏఎస్జీ నటరాజ్ తెలిపారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!