Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం
- బాలికపై అత్యాచారం
- ఇద్దరు నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం జరిగింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఢిల్లీలో 40 కి.మీ దూరంలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఆగస్టు 4న గ్రేటర్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలోని ఓ పార్కింగ్ స్థలం నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
బంధువుల ఇంటికి వెళ్తుండగా..
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువుల విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా నోయిడాలోని తన బంధువు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. భారీ వర్షం, చీకటి సమయంలో నోయిడాలోని పరి చౌక్ దగ్గర దిగింది. బంధువుల ఇంటికి చేరేందుకు చాలా సమయం పడుతుంది. అప్పటికే రాత్రి 9 గంటలు దాటింది. ఏదైనా వాహనం దొరుకుతుందేమోనని ఎదురుచూస్తోంది. గమ్యస్థానం చేరేందుకు ఇంకా సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అదే సమయంలో అటుగా వస్తున్న ఓ బస్సు ఆమె దగ్గర ఆపాడు. స్లీపర్ బస్సు కావడంతో లోపల ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సులోకి ఎక్కిన బాలికకు తాము కూడా నోయిడా సెక్టార్-63 వైపు వెళ్తున్నామని కండక్టర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె బస్సులోకి ఎక్కింది. అయితే వాస్తవానికి ఆ బస్సు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న వర్క్షాప్ నుంచి తిరిగి వస్తోంది. బస్సు కదలడం ప్రారంభమైన కొద్దిసేపటికే కండక్టర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమెపై నిందితులు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ప్రతిఘటిస్తే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.
లైంగిక దాడి అనంతరం నిందితులు బాలికను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. స్లీపర్ బస్సులోని బెర్త్లకు కర్టెన్లు ఉండటాన్ని నిందితులు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో బాలికకు సంబంధించిన వెంట్రుకలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. వాటిని ఆధారాలుగా సేకరించారు.
నిందితులు ఇద్దరూ విశ్వనాథ్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ సంస్థలో రెండేళ్లకు పైగా పనిచేస్తున్నట్లు సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా దర్యాప్తు అధికారులు సేకరించారు. వాటిని పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. తాజా ఘటన దేశ రాజధాని ఢిల్లీలో 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేస్తోంది.
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!